జగదీష్ రెడ్డి అనుచరులకు దేవుళ్లు, చెరువులు అన్న కూడా లెక్కలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కర్నాల చెరువును కూడా ఆక్రమించారని విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అలుగు పోయే దాని మీద రోడ్డు వేశారని, దీనిపై నేను గూగుల్ ఫొటోలతో హైడ్రాకు ఫిర్యాదు చేస్తాని తెలిపారు.దీనిపై చర్యలు తీసుకుంటారో లేదో అన్న దాన్ని బట్టి ఉత్తమ్, జగదీశ్ రెడ్డిల అండర్ స్టాండింగ్ తెలుస్తుందన్నారు. సూర్యాపేట జిల్లాలో జాగృతి జనంబాటలో భాగంగా రెండురోజుల పర్యటన సందర్భంగా పలు ప్రాంతాలను సందర్శించిన కవిత జగదీశ్వర్ రెడ్డి అక్రమాలపై ధ్వజమెత్తారు.
“విజయవాడ-సూర్యాపేట హై వే వెంచర్ లో భారీ అక్రమాలు జరిగాయి. వాటిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. జీవో 58, 59ని అడ్డుపెట్టుకొని సూర్యాపేటలో 5 ఎకరాల భూమిని రైగ్యులరైజ్ చేసుకున్నారు. గుర్రంపోడు భూముల విషయంలో స్కామ్ జరిగినట్లు గతంలో పెద్ద వివాదం నడిచింది. కానీ ఈ ప్రభుత్వం కూడా దానిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో చెప్పాలి. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నా సూర్యాపేట పరిస్థితి మారలేదు. కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నించాలి. టౌన్ లో పూల్లారెడ్డి చెరువును ట్యాంక్ బండ్ చేస్తామని మాట నిలుపుకోలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలు అనగానే హడావుడిగా సీసీ రోడ్డు వేశారు.
ఇప్పుడు ప్రభుత్వం మారాక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం వాటిని తవ్వతున్నారు. అంటే ఎవరికీ లాభం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం చేయటం చూస్తుంటే బాధనిపిస్తోంది. వాగుల్లో కట్టిన చెక్ డ్యాములు ఏడాదికే కొట్టుకుపోయాయి. టౌన్ లో ఆత్మగౌరవ కుల భవనాలు ఇవ్వలేదు. సూర్యాపేటలో 900 పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారు. వాటిలో 800 మందికి సున్నం కూడా వేయకుండా ఇచ్చేశారు. చీదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఎలాంటి వసతులు లేకుండా ఇచ్చేశారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో 300 మంది ఫ్రొఫెసర్లకు గాను 150 మంది మాత్రమే ఉన్నారు. ఇక చీదేళ్ల గ్రామాన్ని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దత్తత తీసుకున్నారంట. అక్కడి 6 కిలోమీటర్ల రోడ్డుపై ప్రయాణించాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించినంత సమయం పడుతోంది. రోడ్డు పూర్తిగా ఆధ్వాన్నంగా గుంతలతో నిండి ఉంది. వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నా. హుజుర్ నగర్ లో కూడా 14 ఏళ్ల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో కట్టిన 2 వేల ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పటికైనా వాటిని అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. కృష్ణానది మఠంపల్లి వద్ద ఓ ఫార్మా కంపెనీ వాడు మొత్తం వెస్టేజ్ పడేశాడు. దీంతో వంద గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు. కానీ ఆ వేస్టేజ్ పడేసిన ఫార్మా కంపెనీని గుర్తించలేదు. నిఘా వ్యవస్థ, పోలీసులు ఏం చేస్తున్నారో మంత్రిగారు చెప్పాలి.”

“ఫణిగిరి మ్యూజియంలో కళాఖండాలు ఇప్పటికీ మా జాగృతి ఆఫీసులో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే జూరాస్ పల్లి గుట్ట మీద దేవస్థానం కోసం కొట్లాడినం. గొల్లగట్టు జాతర ఘనంగా జరిపించాలని కూడా మేము ఫైట్ చేశాం.
బీఎన్ రెడ్డి, మల్లు స్వరాజ్యం, మారోజు వీరన్న లాంటి మహనీయులు పుట్టిన ఈ గడ్డకు సలాం. బీఎన్ రెడ్డి పేరును ఏదైనా ప్రాజెక్టుకు పెట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. మల్లు స్వరాజ్యం కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఖర్చుతో సుర్యాపేటలో ఏర్పాటు చేయాలి.
ఉప్పల మధుసూదన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంతో నిజాయితీ పరులు. ఎమ్మెల్యే అయినా కూడా ఆయన చెప్పులు కుట్టారు. ఏదైనా మంచి కార్యక్రమానికి ఆయన పేరు పెట్టాలి. బండి యాదగిరి రాసిన పాట స్ఫూర్తితో నిజాం పైన పోరాటం చేశాం. అదే స్ఫూర్తితో నేను కూడా గుంటనక్క మీద యుద్ధం చేస్తున్నా. సామాజిక తెలంగాణను ప్రతిపాదించిన వ్యక్తి మారోజు వీరన్న. ఆయన స్ఫూర్తితోనే మేము కూడా ఉద్యమం చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా అర్వపల్లి కేజీబీవీలో దోమలు, కోతుల బెడదతో తీవ్ర సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లలే కాదా అని చులకనగా చూస్తే చరిత్ర మార్చేస్తారని హెచ్చరిస్తున్నా.
ఎస్సారెస్పీ కాల్వ దగ్గర చూసిన కాల్వలు మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ లైన్డ్ కెనాల్స్ తో మనకు అన్యాయం చేశారు. తెలంగాణ వచ్చాక మనం సరిచేసుకుంది ఏమీ లేదు. కనీసం మెయింటెనెన్స్ కు రూపాయి కూడా ఇవ్వలేదు. ఆపరేషన్స్ అండే మెయింటెనెన్స్ విభాగానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పైసా నిధులు ఇవ్వలేదు. రుద్రమ చెరువును వెంటనే 5 టీఎంసీల రిజర్వాయర్ గా మార్చాలి. తుంగతుర్తి లో 100 పడకల హాస్పిటల్ పూర్తి కాలేదు. ఉన్న 30 పడకల హాస్పిటల్ ను కూల్చేసి 12 బెడ్స్ చేశారు. కానీ పనులు పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవటంతో పనులు చేయలేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఆయనకు జిల్లాలో మూడు హాస్పిటల్స్ నిర్మాణం టెండర్ వస్తే ఒకటి తర్వాత ఒకటి కడతామంటున్నారు. అగ్రిమెంటులో ఉన్న సమయం దాటిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ అంశాన్ని కలెక్టర్ పరిశీలించాలి. గుండ్ల సింగారంలో బ్రిడ్జి పరిస్థితి దారుణంగా ఉంది. దాని స్థానంలో కొత్తది నిర్మించాలి. తుంగతుర్తి, సుర్యాపేటలో 20 రోజులుగా మిషన్ భగీరథ మంచి నీళ్లు వస్తలేవు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలి. గత ప్రభుత్వంలోనే ఇసుక బుక్కారు. ఇప్పుడు ఉన్న వాళ్లు కూడా ఇసుక బుక్కుతున్నారు. కానీ దాని కారణంగా బ్రిడ్జిలు కూలే పరిస్థితి వస్తుంది. ఇసుక విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే మ్యాచ్ ఫిక్సింగ్ తో దోపిడీ చేస్తున్నారు. తుంగతుర్తిని మున్సిపాలిటీ చేయలేదు. ఎందుకు చేస్తలేరని ప్రజలు అడుగుతున్నారు. సూర్యాపేట్ లో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ను ఊరిలో కట్టాల్సి ఉండగా ఊరి బయట కట్టారు. టౌన్ లో రోడ్ వెడల్పు కోసం నోటీసులు ఇచ్చిన మూడు రోజుల్లో 300 షాపులు కూల్చేశారు. 8 ఏళ్లుగా వారికి పరిహారం ఇవ్వలేదు. కేసు వేసిన వాళ్లను భయపెడుతున్నారు.
కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఆ 3 వందల షాపుల వారికి పరిహారం ఇప్పించాలి. ఇంటిగ్రేటేడ్ వెజ్-నాజ్ వెజ్ మార్కెట్ 50 కోట్లతో కట్టారంటున్నారు. కానీ అక్కడ ఉన్న సమస్యలతో అది అందుబాటులోకి రాలేదు. “
“ఎస్సారెస్సీ స్టేజ్- 2 లో భాగంగా సూర్యాపేటలో ఒక్క రిజర్వాయర్ కూడా లేదు. రిజర్వాయర్లు కడితినే సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి ప్రజలకు మేలు జరుగుతుంది. అదే విధంగా కాల్వలకు కూడా లైనింగ్ వేయించాలి. 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చే మూసీ గేట్ గతంలో ఊడిపోయింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రూ.280 కోట్లతో ప్రాజెక్ట్ కడతామని అన్నారు. కానీ ఇప్పటికీ అతిగతీ లేదు. హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో 54 లిప్ట్ లు ఉంటే 17 లిఫ్టులు పాక్షిక్షంగా, 21 లిఫ్టులు పూర్తిగా పనిచేస్తలేవు. వీటన్నింటిని కాదని గతంలో బీఆర్ఎస్ 1450 కోట్లతో మెగా లిప్ట్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అప్పుడు దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు రూ.500 కోట్లు పెంచి వేగంగా ఆ లిప్ట్ పనులను చేస్తున్నారు. మూడేళ్లలో ఏమీ మారిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ లిప్ట్ పనులను చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. లిఫ్టుల రిపేర్ కు డబ్బులు ఇస్తారా? అదే విధంగా మెగా లిప్ట్ లో మీ వాటా ఎంతో చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే 13 వేల ఎకరాల సున్నపు గనులు పోయాయి. పులిచింతల ప్రాజెక్ట్ ద్వారా మనకు నష్టం జరిగితే కూడా ఆయన మాట్లాడలేదు. ఆంధ్రా ప్రభుత్వం 36 టీఎంసీల నీటిని ఆపితే మఠంపల్లి వద్ద లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం మునిగిపోతుంది. మీకు స్వామి మీద భక్తి ఉంటే 30 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు స్టోర్ చేయకుండా ఆంధ్రా ప్రభుత్వాన్ని ఒప్పించాలి. నాగార్జున సాగర్ లెప్ట్ కెనాల్ మెయింటెన్స్ ను పట్టించుకోవటం లేదు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టాలి. 1000 కోట్ల కస్టమ్ మిల్లింగ్ స్కామ్ నిందితులపై ఇప్పటికీ చర్యలు తీసుకుంటలేరు. ఊరి మధ్యలో కట్టాల్సిన కలెక్టరేట్ ను ఊరవతల ప్రైవేట్ వెంచర్ లో కట్టారు. పైగా అక్కడ 25 ఎకరాలను రూ. 25 లక్షలు ఇచ్చి కొన్నారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టులో భూమి పోయిన రైతులకు కూడా ఎకరాకు ఇంత పరిహారం ఇవ్వలేదు. జగదీష్ అన్న చాలా స్పెషల్ కాబట్టి ఆయన ఎకరాకు రూ. 25 లక్షలు ఇప్పించుకున్నారు.
ఆ చుట్టుపక్కల 3 వందల ఎకరాలు వెంచర్లు వేసి అక్రమాలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఫ్రెండ్స్ కనుక చర్యలు ఉండవు. కానీ తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియాలని నేను చెబుతున్నా. చివ్వెల మండలంలో ఆరు ఎకరాల భూమి దేవుడి భూములను కబ్జా చేశారు. ఎండో మెంట్ అధికారులు కచ్చితంగా దానిపై చర్యలు తీసుకోవాలి. టౌన్ లోని ఆటో నగర్ వాళ్లకు 50 ఎకరాలు ఇస్తామని చెప్పి 5 ఎకరాలు కూడా ఇవ్వలేదు.
జగదీష్ అన్న వాళ్ల అమ్మ బర్త్ డే సందర్భంగా కబడ్డీ పోటీలు పెట్టి దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువు తీశారు.
పోటీల సందర్భంగా వీళ్లు అస్తవ్యస్థంగా చేసిన ఏర్పాట్లతో ఒకరు చనిపోయారు. 26 మందికి గాయాలయ్యాయి.
వారికి ఉచితంగా వైద్యం కూడా చేయించలేదు. దీంతో వాళ్లంతా తెలంగాణ గురించి చెడుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అవకాశం ఉంటే ఆ గాయపడిన వారికి చికిత్స అందించాలి. జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. వాళ్ల అవినీతి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అవినీతి లేకుండా ఉన్నప్పుడే అట్టడుగునున్న ప్రజలకు కూడా లాభం జరుగుతుంది. లేదంటే అవినీతితో అక్రమార్జన చేసి మళ్లీ ఎన్నికల్లో ఖర్చు చేస్తారు. పది వేల రూపాయలు ఓటుకు ఇచ్చి తండ్రిని సర్పంచ్ గా గెలిపించుకుంటారు. అవినీతి కారణంగా ప్రజలకు కావాల్సిన మేలు, ప్రయోజనాలు జరగవు. నేను మాట్లాడటం కారణంగా జగదీష్ రెడ్డి చుట్టు ఉన్న వాళ్లు నాపై ఏడుస్తారు. కానీ సూర్యాపేట్ జిల్లాలోని పది లక్షల మంది ప్రజల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా సరే మనం అవినీతి లేకుండా తెలంగాణను బాగు చేసుకోవాలి. వ్యవస్థలో లిమిటెడ్ గా ఉన్న అవినీతిని మనం ఆపలేము. కానీ ఇష్టానుసారంగా అవినీతి పాల్పడటం కరెక్ట్ కాదు. అడ్డగోలుగా అవినీతి చేసే వ్యక్తులపై నేను మాట్లాడుతూనే ఉంటా. యూరియా కోసం యాప్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ముందు రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి యాప్ పెట్టాలి. లేదంటే వాళ్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. పార్టీనే వద్దనుకున్న తర్వాత నైతికతతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. నేను జాగృతి ఏర్పాటుకు ముందు లక్షన్నర కిలోమీటర్లు తిరిగి అధ్యయనం చేశాను. ఇప్పుడు కూడా అదే విధంగా సమస్యలపై అధ్యయనం చేస్తున్నా. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో రెండు రోజులు ఉంటూ ప్రతి సమస్యపై మాట్లాడుతున్న నాయకులు ఎవరైనా ఉన్నారా?
బీఆర్ఎస్ లో జరిగిన అన్యాయంపై మాట్లాడుతూనే ఇప్పుడు ఎలా బాగు చేయాలని చూస్తున్నాం.”