Farmers explaining problems at Suryapet Integrated Vegetable Market to Kavitha

నిరుపయోగంగా మార్కెట్ కాంప్లెక్స్ -కల్వకుంట్ల కవిత | సూర్యాపేట మార్కెట్ సందర్శన | (సూర్యాపేట)

కోట్లు వెచ్చించి నిర్మించిన సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వినియోగంలోకి తేవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాటలో భాగంగా శనివారం సూర్యాపేట మార్కెట్ ను సందర్శించి రైతులు, చిరువ్యాపారులతో మట్లాడారు. 

 పెద్ద ఎత్తున కట్టిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఎందుకు వాడకంలో లేదో సమీక్షించాలని కోరారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ కట్టినా ఏ మాత్రం నాణ్యత లేదని కవిత విమర్శించారు. రీ సౌండ్ తో ఇబ్బందిగా ఉందని, గాలి కూడా రావటం లేదని రైతులు చెబుతున్నారన్నారు. 

ప్లాట్ ఫామ్ ఎత్తుగా కట్టడం వల్ల బయట మెట్ల నుంచి ప్లాట్ ఫామ్ వరకు కూరగాయలు తీసుకెళ్లటం రైతులకు, ఇబ్బందిగా మారిందని వివరించారు. 

మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్లలో మహిళలు, పెద్ద వయసు వాళ్లే ఎక్కువగా ఉన్నారని, మెట్ల నుంచి ప్లాట్ ఫామ్ వరకు కూరగాయలు తీసుకెళ్లటం వారికి ఇబ్బందిగా మారిందని కవిత చెప్పారు. దీంతో వాళ్లంతా  మార్కెట్ బయటనే కూరగాయలు అమ్ముతున్నారని వివరించారు. రూ. 50 కోట్లతో ఇంత లోపభూయిష్టంగా మార్కెట్  కాంప్లెక్స్ నిర్మించడం దారుణమన్నారు. 

ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం నుంచి ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం పూనుకొని సత్వరమే మార్కెట్ ను అందుబాటులోకి తేవాలని కవిత డిమాండ్ చేశారు. ఇలాంటి సమస్యలపైనే జాగృతి జనంబాట చేపట్మేటామని వెల్ములడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. అధికారులపై ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సూర్యాపేట ఇంటిగ్రేటేడ్ మార్కెట్ విషయంలో కలెక్టర్  దృష్టి పెట్టాలని, చిన్నపాటి సమస్యలతో ఈ మార్కెట్ అందుబాటులో లేకుండా పోయిందని కవిత సూచించారు.