బీఆర్ఎస్ విష కౌగిలిలో ఉండి కవితక్క పై అసత్య ప్రచారం

కుక్కను కొట్టినట్లు కొడతాం – తెలంగాణ జాగృతి నాయకులు శ్రీకాంత్ గౌడ్, ఆనంద్, మాధవి | హైదరాబాద్ 

Telangana Jagruthi leaders condemn Teenmaar Mallanna allegations

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న విష ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు మండిపడ్డారు. అగ్గిపెట్టె హరీశ్ రావు డైరెక్షన్ లో , బీఆర్ఎస్ విష కౌగిలిలో చేరి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి బంజారాహిల్స్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్, జాగృతి నాయకులు ఆనంద్, మాధవి మీడియాతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్నవి నీచ, దిగజారుడు, బ్లాక్ మెయిల్ రాజకీయాలని శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రి వర్గంలోకి కవితను తీసుకునే ప్రయత్నం చేశారంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. జూన్ 8 న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారని అప్పుడు కవిత బీఆర్ఎస్ లోనే ఉన్నారన్న సోయి కూడా లేకుండా మల్లన్న మాట్లాడుతున్నారని అన్నారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టేలా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. టీఆర్పీ అనే పార్టీ పెట్టిన నువ్వు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినా ఎమ్మెల్సీకి ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. నీ పార్టీకి ఇంకా గుర్తు కూడా రాలేదని….కచ్చితంగా నీకు క్యూఆర్ కోడ్ ఉన్న గుర్తు రావాలని కోరుకుంటున్నామన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా మళ్లీ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే నీచమైన వ్యక్తివి నువ్వు అన్నారు. నీ టీఆర్పీ పార్టీ పేరు టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అని పెట్టుకోవాలని సూచించారు. నీ ఛానెల్ వ్యూస్ కోసం ఇష్టానుసారం మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. సిగ్గు, లజ్జ లేని వ్యక్తి తీన్మార్ మల్లన్న అని మండిపడ్డారు. ఛాయ్ కి పైసలు అడుకున్న నీకు హెచ్ఎండీఏ పరిధిలో 660 ఎకరాల భూమి ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. స్కూటీ పైన తిరిగే నీకు హెలికాప్టర్ లో ప్రచారానికి వెళ్లేంత డబ్బులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. సాయి ఈశ్వరాచారి అనే బీసీ బిడ్డ ఆత్మహత్యకు నువ్వే కారణమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నట్లే నువ్వు బీసీల కోసం బలిదానం చేసుకోవాలంటూ ఆయనను రెచ్చగొట్టలేదా అని ప్రశ్నించారు. కచ్చితంగా ఈశ్వరాచారి మరణం తీన్మార్ మల్లన్న చేసిన హత్యేనని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పేదలు నీ దగ్గరకు వస్తే వారిని కూడా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన నీచ చరిత్ర నీదంటూ శ్రీకాంత్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద వారి నుంచి బడా కార్పొరేట్ సంస్థల వరకు బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లకు పడగెత్తావని అన్నారు. కవితక్క మీద అవాకులు పేలినందకు గతంలోనే నీ పై దాడి చేశాం. మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తే ఈసారి పాతళంలోకి తెక్కుతామని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. 

Telangana Jagruthi reacts to propaganda against Kalvakuntla Kavitha

కుక్కను తరిమినట్లు తరిమి కొడతాం.

కవితక్క మీద అవాకులు పేలితే కుక్కను తరిమినట్లు తరిమికొడతామని జాగృతి నేత ఆనంద్ హెచ్చరించారు. హరీష్ రావు ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయి కవితక్క మీద ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. గతంలోనే నీ పై దాడి చేస్తే తృటిలో తప్పించుకున్నావ్. కానీ ఈ సారి మాత్రం నిన్ను తెలంగాణ లో తిరగనివ్వమని హెచ్చరించారు. హరీష్ వేసే కుక్క బిస్కట్ల కోసం కవితక్క మీద మొరుగుతున్నావన్నారు. ఆడబిడ్డల మీద నువ్వు మాట్లాడుతున్న మాటల కారణంగా వాళ్లు రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారని అన్నారు. రాజకీయంగా విధానపరంగా మాట్లాడితే సరే గానీ తలతిక్క వ్యాఖ్యలు చేస్తే కుక్క తరిమినట్లు తరిమికొడతామని ఆనంద్ హెచ్చరించారు. 

దమ్ముంటే నీ వెనుక ఉన్న గుంటనక్కలు మాట్లాడాలి. 

హరీష్ రావు ఇచ్చిన కోట్ల సొమ్ముతో కవితక్క మీద పిచ్చికుక్కల తీన్మార్ మల్లన్న మొరుగుతున్నాడని జాగృతి మహిళా నాయకురాలు మాధవి మండిపడ్డారు. కవితక్క కాలి గోటికి కూడా సరిపోని వ్యక్తి తీన్మార్ మల్లన్న అని విమర్శించారు. దమ్ముంటే మల్లన్న వెనుక ఉండి ఆడిస్తున్న గుంట నక్కలు బయటకు వచ్చి మాట్లాడాలని మాధవి డిమాండ్ చేశారు. మల్లన్న అజెండా ఏంటీ ఆయన ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్నారు. బీసీల కోసం పార్టీ పెట్టానని చెబుతున్న మల్లన్న వెనుక అసలు ఎంత మంది బీసీలు ఉన్నారో చెప్పాలని కోరారు. మున్నూరు కాపు కులంలో చెడబుట్టావని మాధవి మండిపడ్డారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ ను తిట్టి, ఇప్పుడు కాంగ్రెస్ ను తిడుతున్నావ్. అసలు నీ పార్టీ ఏంటో, విధానాలు ఏంటో ప్రజలకు చెప్పాలని కోరారు. ఆస్తుల పంచాయితీ కాదని శాసన మండలి కవిత గారు స్పష్టంగా దేవుడి మీద, తన పిల్లల మీద ఒట్టు వేశారు. కవితక్కను ప్రమాణం చేసి చెప్పాలని అడిగే స్థాయి నీకుందా అని ప్రశ్నించారు. బీసీల కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న కవితక్క పై పిచ్చి కూతలు కూస్తే నీ భరతం పట్టటం ఖాయమని మాధవి హెచ్చరించారు.