తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలతో కల్వకుంట్ల కవిత గారి వరుస సమావేశాలు
తెలంగాణ సమగ్రాభివృద్ధి – సబ్బండ వర్గాల వికాసం – సామాజిక తెలంగాణ సాధన కోసం 50 అధ్యయన కమిటీలను ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా బ్లూ ప్రింట్ రూపొందిస్తున్న అధ్యయన కమిటీలు
ఇప్పటికే నివేదిక సమర్పించిన పలు కమిటీలు.. త్వరలోనే నివేదికలు ఇవ్వనున్న మిగతా కమిటీలు.. ఒక్కో కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను నియమించిన జాగృతి అధ్యక్షురాలు
ఆయా రంగాల నిపుణులు, ప్రముఖులు, క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా నివేదికల రూపకల్పన
ఆయా కమిటీల నివేదికల ఆధారంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు వివిధ వర్గాల ప్రజల సాధికారత కోసం రూట్ మ్యాప్ రూపొంచే ప్రయత్నాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు








