ఏటా సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి.. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు జాగృతి ప్రధాన కార్యాలయంలో భోగి వేడుకలు నిర్వహించారు.
పూజలు చేసి భోగి మంట వెలిగించారు జాగృతి నాయకులు. ఈ సందర్భంగా భోగి మంట వద్ద ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
గంగిరెద్దులకు పూజలు చేశారు.. హరిదాసులకు భిక్ష ప్రదానం చేశారు.











