<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Telangana Jagruthi</title>
	<atom:link href="https://www.telanganajagruthi.org/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://www.telanganajagruthi.org/</link>
	<description></description>
	<lastBuildDate>Sat, 16 May 2026 11:27:12 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://www.telanganajagruthi.org/wp-content/uploads/2025/10/favicon-150x150.png</url>
	<title>Telangana Jagruthi</title>
	<link>https://www.telanganajagruthi.org/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>K Kavitha Demands PM Modi Remove Bandi Sanjay Over Son’s POCSO Case</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-letter-pm-modi-bandi-sanjay-son-pocso-case/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Sat, 16 May 2026 11:27:11 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23745</guid>

					<description><![CDATA[<p>బండి సంజయ్ ను మంత్రివర్గం నుండి తొలగించాలి ఆయన కుమారుడి మీద నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయన పదవిలో ఉండొద్దు ప్రధాని మోడీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత లేఖ (హైదరాబాద్) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ ప్రధాని మోడీకి తెలంగాణ రక్షణ [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-letter-pm-modi-bandi-sanjay-son-pocso-case/">K Kavitha Demands PM Modi Remove Bandi Sanjay Over Son’s POCSO Case</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">బండి సంజయ్ ను మంత్రివర్గం నుండి తొలగించాలి</h2>



<h2 class="wp-block-heading">ఆయన కుమారుడి మీద నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయన పదవిలో ఉండొద్దు</h2>



<h2 class="wp-block-heading">ప్రధాని మోడీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత లేఖ</h2>



<p><strong>(హైదరాబాద్)</strong></p>



<p>కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ ప్రధాని మోడీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. బండి భగీరథ్ మీద అత్యంత తీవ్రమైన పోక్సో కేసు నమోదైనందున కేసు విచారణ పారదర్శకంగా జరగాలంటే బండి సంజయ్ పదవిలో ఉండకూడదని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్ర విచారణ జరిగేందుకు ప్రధాని మోడీ చొరవ చూపాలన్నారు. దేశంలో మైనర్ల రక్షణ కన్నా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కాదని ప్రధాని గుర్తించాలన్నారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలన్నా…విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండొద్దని సూచించారు. రాజ్యాంగ నిబద్ధతను, నైతిక విలువలను కాపాడటం ప్రధానిగా మీ తక్షణ కర్తవ్యమని గుర్తించాలని కవిత అన్నారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి తప్పించాలని మిమ్మల్ని కోరుతున్నాంటూ ప్రధానికి రాసిన లేఖలో కవిత తెలిపారు.</p>



<h2 class="wp-block-heading">లేఖలో ప్రస్తావించిన అంశాలు</h2>



<p>కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిపై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS), అలాగే అత్యంత తీవ్రమైన బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO) కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. మైనర్ బాలికకు సంబంధించిన కేసు కావడంతో ఈ దర్యాప్తు లోఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.<br>బండి సంజయ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకమైన, చట్టాన్ని అమలు చేసే అధికారాలు గల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. చట్టపరంగా ఆయన కుమారుడిపై నేర నిరూపణ అనేది న్యాయస్థానం తేల్చాల్సిన విషయమే. కానీ ఆయన అదే పదవిలో కొనసాగడం వల్ల దర్యాప్తు ప్రక్రియ, సాక్ష్యాల సేకరణ, సాక్షుల రక్షణపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కేసులో బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలన్న విచారణలో రాజకీయ జోక్యం ఉండకూడదు. రాజ్యాంగ నిబద్ధతను, నైతిక విలువలను కాపాడటం మీ తక్షణ కర్తవ్యం.</p>



<p>దేశంలోని మైనర్ల రక్షణ, న్యాయవ్యవస్థ సమగ్రత అనేది రాజకీయ ప్రయోజనాల కంటే మిన్న. అందుకే కేసు దర్యాప్తు , న్యాయస్థాన విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ కుమార్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి.</p>



<div data-wp-interactive="core/file" class="wp-block-file"><object data-wp-bind--hidden="!state.hasPdfPreview" hidden class="wp-block-file__embed" data="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/05/K_Kavitha_Letter_PM_Modi_Bandi_Sanjay_POCSO_Case.pdf" type="application/pdf" style="width:100%;height:600px" aria-label="Embed of K_Kavitha_Letter_PM_Modi_Bandi_Sanjay_POCSO_Case."></object><a id="wp-block-file--media-90b0ffc3-c61f-4ce7-b1da-8c6892ec1f5e" href="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/05/K_Kavitha_Letter_PM_Modi_Bandi_Sanjay_POCSO_Case.pdf">K_Kavitha_Letter_PM_Modi_Bandi_Sanjay_POCSO_Case</a></div>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-letter-pm-modi-bandi-sanjay-son-pocso-case/">K Kavitha Demands PM Modi Remove Bandi Sanjay Over Son’s POCSO Case</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>TRS Leaders Slam RS Praveen Kumar Over Remarks on Kavitha and POCSO Case</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/trs-leaders-bandi-sanjay-son-case/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Sat, 16 May 2026 05:28:38 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23742</guid>

					<description><![CDATA[<p>ఆర్ఎస్ ప్రవీణ్.. జబర్దస్త్ స్కిట్స్ బంద్ చెయ్ బాధితురాలి ప్రైవసీకి భంగం కలిగించవద్దంటే మా పార్టీ అధినేతను టార్గెట్ చేస్తావా? పొలిటికల్ డ్రామాలు ఆపి&#160; నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచు &#160;-టీఆర్ఎస్ నేతలు చిలుక ప్రవీణ్, సూరారపు కృష్ణవేణి (హైదరాబాద్) బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫామ్ హోస్ నుంచి వచ్చే స్క్రిప్టులు చదువుతూ రోజుకో జబర్దస్త్ స్కిట్ చేస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నేతలు చిలుక ప్రవీణ్, సూరారపు కృష్ణవేణి [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/trs-leaders-bandi-sanjay-son-case/">TRS Leaders Slam RS Praveen Kumar Over Remarks on Kavitha and POCSO Case</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">ఆర్ఎస్ ప్రవీణ్.. జబర్దస్త్ స్కిట్స్ బంద్ చెయ్</h2>



<h2 class="wp-block-heading">బాధితురాలి ప్రైవసీకి భంగం కలిగించవద్దంటే మా పార్టీ అధినేతను టార్గెట్ చేస్తావా?</h2>



<h2 class="wp-block-heading">పొలిటికల్ డ్రామాలు ఆపి&nbsp; నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచు</h2>



<h2 class="wp-block-heading">&nbsp;-టీఆర్ఎస్ నేతలు చిలుక ప్రవీణ్, సూరారపు కృష్ణవేణి</h2>



<p><strong>(హైదరాబాద్)</strong></p>



<p>బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫామ్ హోస్ నుంచి వచ్చే స్క్రిప్టులు చదువుతూ రోజుకో జబర్దస్త్ స్కిట్ చేస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నేతలు చిలుక ప్రవీణ్, సూరారపు కృష్ణవేణి మండిపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన తమ పార్టీ అధినేత కవితను టార్గెట్ చేస్తారా అని ప్రశ్నించారు.&nbsp; ఈ సంఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలన్న ఆకాంక్ష బీఆర్ఎస్ లో ఏమాత్రం కనిపిచటం లేదన్నారు. నిందితున్ని అరెస్ట్ చేసి.. బాధితురాలి ప్రైవసీని కాపాడాలని కవిత మాట్లాడితే ఆమెపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితురాలిని బద్నాం చేసైనా తమ రాజకీయ పబ్బం గడపాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. నిజంగా బాధితురాలికి న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">పొలిటకల్ డ్రామాలే</h2>



<p>బండి సంజయ్ కుమారుడి కేసులో బాధితురాలికి న్యాయం జరగాలని, ఆమె ప్రైవసీని కాపాడాలని ఒక అమ్మ మాదిరిగా తమ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆలోచించారని చిలుక ప్రవీణ్ అన్నారు. ఈ క్రమంలోనే నిందితుడు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. బాధితురాలిని బజారుకీడ్చవద్దని కవిత మంచి సూచన చేస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయాలన్న ఉద్దేశం కన్నా కూడా రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఉద్దేశమే బీఆర్ఎస్ లో ఎక్కువగా కనిపిస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే సందర్భం లేకుండా తమ నాయకురాలు కవితపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారని ప్రవీణ్ అన్నారు.&nbsp; మంచి ఉద్దేశంతో బాధితురాలి తరఫున మాట్లాడిన కవితపై ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా బాధితురాలికి న్యాయం చేయాలనుకుంటే నిందితుడిని దాచిందెవరో మీకు తెలియదా అని ప్రశ్నించారు. నిందితుడిని దాచిన వారిపై, అదే విధంగా నామమాత్రం సెక్షన్స్ పెట్టిన పోలీసులపై ఒత్తిడి పెంచాల్సింది పోయి కవిత గారిని ఎందుకు టార్గెట్ చేశారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు, బండి సంజయ్ ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. అంతేకానీ పోస్టర్లు వేసి, మెట్రోలో ప్రచారం చేయటం ద్వారా బాధితురాలికి న్యాయం ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు. ఫామ్ హౌస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ లను చదువుతూ రోజుకో జబర్దస్త్ స్కిట్స్ వేయటం ఆర్ఎస్ ప్రవీణ్ గారు మానుకోవాలనిసూచించారు. గత వారం రోజులుగా బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాల ద్వారా కేసులో ఏమైనా పురోగతి వచ్చిందా అని ప్రశ్నించారు. ముందు నిందితుడిని పట్టుకోవాలంటూ ప్రభుత్వంపై పోలీసులపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ ను డిమాండ్ చేశారు. కవిత గారికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఆమెపై సందర్భం లేకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. మీ రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారని సందర్బం వచ్చినప్పుడు కచ్చితంగా బీఆర్ఎస్ కు బుద్ది చెప్తారన్నారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">అప్పుడెందుకు మాట్లాడలేదు?</h2>



<p>బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ దగ్గర ఉండే ఒక వ్యక్తి ఓ మహిళ జర్నలిస్ట్ మరణానికి కారణమైతే ఆర్ఎస్ ప్రవీణ్ అప్పుడెందుకు మాట్లాడలేదని టీఆర్ఎస్ నాయకురాలు సూరారపు కృష్ణవేణి ప్రశ్నించారు. ఆ వ్యక్తిపై పోక్సో కేసు కూడా పెట్టారని గుర్తు చేశారు. పోక్సో కేసు నిందితుడు స్వేచ్ఛగా తిరుగుతున్నది ప్రవీణ్ కుమార్ కు కనిపిచంటం లేదా అని నిలదీశారు. మహిళ జర్నలిస్ట్ చనిపోతే&nbsp; బీఆర్ఎస్ కు చెందిన ఆ టీవీ యాజమాన్యం కూడా ఆమెను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.&nbsp; బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని చెప్పారు. ఇలాంటి సంఘటనలను రాజకీయాలకు తాము వాడుకోమని&#8230;ప్రజా సమస్యలపై కొట్లాడుతామని అన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/trs-leaders-bandi-sanjay-son-case/">TRS Leaders Slam RS Praveen Kumar Over Remarks on Kavitha and POCSO Case</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>K Kavitha Slams Revanth Reddy, Calls Him ‘RSS CM’ at Hyderabad Conclave</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-way2news-conclave-telangana/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Sat, 16 May 2026 05:22:46 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23739</guid>

					<description><![CDATA[<p>బడే భాయ్..ఛోటే భాయ్ కలిసే ఉన్నారు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం బండి రాజీనామా చేయాలి ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సరే తెలంగాణ రక్షణ సేనదే అధికారం &#160;-కల్వకుంట్ల కవిత (వే 2 న్యూస్ కాంక్లేవ్, హైదరాబాద్) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో కొత్తగా కలిసేదేమీ లేదని ఆల్రడీ బీజేపీతో కలిసే పనిచేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం అన్నది ఎప్పుడో నిరూపితమైందని స్పష్టం [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-way2news-conclave-telangana/">K Kavitha Slams Revanth Reddy, Calls Him ‘RSS CM’ at Hyderabad Conclave</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">బడే భాయ్..ఛోటే భాయ్ కలిసే ఉన్నారు</h2>



<h2 class="wp-block-heading">రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం</h2>



<h2 class="wp-block-heading">బండి రాజీనామా చేయాలి</h2>



<h2 class="wp-block-heading">ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సరే తెలంగాణ రక్షణ సేనదే అధికారం</h2>



<h2 class="wp-block-heading">&nbsp;-కల్వకుంట్ల కవిత</h2>



<p><strong>(వే 2 న్యూస్ కాంక్లేవ్, హైదరాబాద్)</strong></p>



<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో కొత్తగా కలిసేదేమీ లేదని ఆల్రడీ బీజేపీతో కలిసే పనిచేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం అన్నది ఎప్పుడో నిరూపితమైందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో శుక్రవారం నిర్వహించిన వే 2 న్యూస్ కాంక్లేవ్ లో కవిత పాల్గొన్నారు. వివిధ అంశాలపై సూటిగా తన అభిప్రాయాలు చెప్పారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">మహిళా నేతలకు నేను ఆదర్శం కావాలి</h2>



<p>&#8220;తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేశానని చరిత్రలో నా పేరు ఉండాలన్నదే నా కోరిక. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని అనుకొనే పార్టీ పెట్టాను. చుక్క రక్తం చిందించకుండా రాజ్యాంగం ద్వారా దేశంలో మార్పు తెస్తానని అంబేడ్కర్ అన్నారు. అదే విధంగా నేను కూడా రాజకీయ పార్టీ ద్వారా మంచి మార్పు తేవాలని వచ్చాను. కచ్చితంగా నన్ను ప్రజలు దీవిస్తారు, ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. రాజకీయాల్లో కచ్చితంగా వ్యూహాలు ఉండాలి. నేను కేసీఆర్ వద్దే వ్యూహాలు నేర్చుకున్నాను. ఆడపిల్లలు రాజకీయాల్లో వచ్చి ఫెయిల్ అయితే వారికి ఏమీ చేతకాదని ముద్ర వేస్తారు. అందుకే కచ్చితంగా సక్సెస్ కావాలని నేను మంచి స్ట్రాటజీస్ తో ముందుకు వెళ్తున్నా. మన రాష్ట్ర మహిళలు, భారత మహిళ బరువు నా మీద ఉంది. నేను సక్సెస్ అయితే వాళ్లు ఇంకా ధైర్యంగా రాజకీయాల్లోకి వస్తారు. నేను ఏ సమస్య వచ్చినా సరే పాజిటివ్ గానే ఆలోచిస్తాను. ఆడపిల్లలు డిప్రెస్ కావద్దు. &#8220;</p>



<h2 class="wp-block-heading">లిక్కర్ స్కాం బీజేపీ కుట్ర</h2>



<p>&#8220;నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాక నాలో చాలా మార్పు వచ్చింది. ఎవరికీ నచ్చకపోయినా సరే మనకు నచ్చింది చేయాలన్నది నేను గుర్తించాను. కేసీఆర్ చాలా గొప్ప మనిషి. ఇందులో నాకు ఎలాంటి వేరే అభిప్రాయం లేదు. రాదనుకున్న రాష్ట్రాన్ని ఆయన సాధించి పెట్టారు. ఉద్యమ కేసీఆర్ తో నాకు ఎలాంటి సమస్య లేదు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ తోనే నాతో పాటు చాలా మందికి సమస్య వచ్చింది. బీఆర్ఎస్ లో చాలా నిషితమైన పరిశీలనతో కూడిన అభిప్రాయాలు చెప్పేదాన్ని.&nbsp;</p>



<p>ఇంటర్నల్ గా నా అభిప్రాయాలు ఎప్పుడూ చెప్పేదాన్ని. కానీ నన్ను బయటకు వచ్చేలా చేశారు. దాంతో ఇక నేను నా అభిప్రాయాలు బహిరంగంగా చెప్పాల్సిన పరిస్థితి తెచ్చారు.&nbsp;</p>



<p>నేను చిన్ననాటి నుంచి కూడా ఎప్పుడు నిజమే చెప్పాలని నేర్చుకున్నా. ఆ నిజం కారణంగా నాకు నష్టం జరిగినా సరే నేను నిజమే చెబుతా. లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ నన్ను కేజ్రీవాల్ ను బద్నాం చేయాలని చూసింది. అవినీతిపై పోరాటం చేసిన కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసి ఆయనను ఇబ్బంది పెట్టింది. సంస్కృతి, సాంప్రదాయాల కోసం పోరాటం చేసిన నన్ను లిక్కర్ స్కామ్ అంటూ బద్నాం చేశారు. కానీ కోర్టు ఆ ఆరోపణలను డిస్మిస్ చేసింది. పైగా విచారణ చేసిన సీబీఐ అధికారిపై విచారణ చేయాలని ఆదేశించింది. సీబీఐ అధికారిపై విచారణ చేయాలని చెప్పటం దేశంలోనే మొదటిసారి. లిక్కర్ స్కామ్ అంశం వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ల నుంచి నాకు సరైన సపోర్ట్ రాలేదు. కానీ మా అత్త వాళ్ల కుటుంబం మాత్రం నాకు సపోర్ట్ చేసి ధైర్యం ఇచ్చింది. మన మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా మన కుటుంబ సభ్యులు మనతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. &#8220;</p>



<h2 class="wp-block-heading">విద్య, వైద్యం ఫ్రీ</h2>



<p>&#8220;మన దేశంలో 80 శాతం మంది 30 వేల లోపే సంపాదిస్తున్నారు. అందులో 70 శాతం ఆదాయం విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. వారి వద్ద సేవింగ్స్ అనేవే ఉండటం లేదు. అందుకే ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అనేది ప్రైవేట్ లో అయినా సరే ఫ్రీ గా ఇవ్వాలి. రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు తేవాలన్న బలమైన సంకల్పంతోనే తెలంగాణ రక్షణ సేన పెట్టాం. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ రైతులకు ఏమాత్రం మంచి చేయటం లేదు.</p>



<p>వాళ్లు ధరణి అంటే వీళ్లు భూమాత అంటున్నారు. నేమ్ మారినా గేమ్ మాత్రం మారలేదు. వ్యవసాయం రంగంలో చాలా మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉంది.&nbsp;</p>



<p>అదే విధంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వటం మాత్రమే కాదు, వారిని ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తేవాలి. అందుకే మేము మన యువతను నమ్మి 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు వారికి ఋణాలు ఇస్తాం. వారిని వ్యాపారాలు పెట్టేలా ప్రోత్సహిస్తాం. వారిలో నుంచి ఒక్క గూగుల్ లాంటి సంస్థ వచ్చినా చాలు.&#8221;&nbsp;</p>



<h2 class="wp-block-heading">నాయకులను బద్నాం చేయకండి</h2>



<p>&#8220;సోషల్ జస్టిస్ అంటే కులాలకు మాత్రమే కాదు, సమాజంలో అవకాశాలు పొందలేని అన్ని వర్గాలకు మేలు చేయటం. వికలాంగులు, మాజీ మావోయిస్టులు, మాజీ ఆర్మీ జవాన్లు, సీనియర్ సిటిజన్స్ ఇలా అన్ని వర్గాలకు మంచి చేయటమే సోషల్ జస్టిస్. అదే విధంగా అన్ని కులాల వారి ఆడబిడ్డలకు రాజకీయంగా ఎదిగేందుకు మంచి అవకాశాలు కల్పించాలి. జెన్ జీ అంటే ఈ కొత్త తరాన్ని మెప్పించటానికి రాజకీయ నాయకులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వాళ్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడేయగలరన్నది నేపాల్ లో చూశాం. ఐతే జెన్ జీ కి మనం డాక్టర్లు, ఇంజనీర్లు అని కాకుండా రాజకీయాలు, సామాజిక అవగాహన కూడా చేయించాలి. మేము రాజకీయంగా ఏం చేసినా సరే అందులో మా కోర్ బిలీఫ్ ఉంటుంది. మా పార్టీ వరకు వచ్చే సరికి మా కోర్ బిలీఫ్ తెలంగాణయే. మేము ఏం పనిచేసినా సరే అంతర్లీనంగా తెలంగాణ ప్రయోజనాలుంటాయి. అయితే రాజకీయ నాయకులు ఏం చేసినా సరే వాళ్లు అవినీతిపరులు అన్నట్లు మీడియా చూపిస్తుంది. కానీ ఫండమెంటల్ గా ఏ నాయకుడు అవినీతిపరులు కారు. ఫ్యామిలీ జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం నిలబడే వ్యక్తులే రాజకీయ నాయకులు. ఈ దేశంలో ఏ పెద్ద మార్పైనా రాజకీయ పార్టీల కృషి కారణంగానే వచ్చింది. ప్రజాస్వామికంగా మనం అభిప్రాయాలు చెప్పే పరిస్థితి ఉండాలి. భిన్నమైన అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నది. ముందుగా ప్రాంతీయ వాదం తర్వాత జాతీయ వాదం ఉండాలని నేను కోరుకుంటా. అదే విధంగా జెన్ జీ, మహిళలు కూడా పాలిటిక్స్ లోకి రావాలని కోరుతున్నా.&#8221;&nbsp;</p>



<h2 class="wp-block-heading">లక్ష్యం నెరవేరలేదు</h2>



<p>&#8220;తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికీ మనకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేస్తే&#8230;కాంగ్రెస్ ఇప్పటి వరకు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ తెలంగాణలో కొత్తగా 15 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఆంధ్రాలో రాజకీయ నాయకులు మాత్రం వాళ్ల ప్రజల నీళ్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ రాకముందు కన్నా కూడా వాళ్లు ఇప్పుడే నీళ్లు ఎక్కువగా వాడుకుంటున్నారు. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రజలను ఇక్కడి రాజకీయ నాయకులు ఫెయిల్ చేశారు. మనం పెట్టిన ఖర్చుకు వచ్చిన నీళ్లకు సంబంధమే లేదు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పాలమూరులో వలసలు ఆగలేదు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని నేను అనటం లేదు. కానీ మనం వాడుకోవల్సిన నీళ్లను కూడా పూర్తిగా వాడుకోలేదు. గోదావరిలో 960 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంటే 250 టీఎంసీలు కూడా మనం వాడుకోలేదు. 30 నెలల్లో పూర్తి చేయాల్సిన పాలమూరు ప్రాజెక్టును 132 నెలలైనా చేయటం లేదు. 32 వేల కోట్ల రూపాయల అంచనాలు కాస్త ఇప్పుడు 85 వేల కోట్ల రూపాయలకు చేరాయి. పైగా పదేళ్లు నీళ్లు ఇవ్వకపోవటంతో రైతులు రెండున్నర లక్షల కోట్ల ఆదాయం నష్టపోయారు. ఇప్పటికీ గోదావరి నుంచి 4 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. &#8220;</p>



<h2 class="wp-block-heading">బండి సంజయ్ రాజీనామా చేయాలి</h2>



<p>&#8220;వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన సరే తెలంగాణ రక్షణ సేననే అధికారంలోకి వస్తుంది. మేము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. రాజకీయాల్లో ఇవ్వాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. అప్పటి వరకు బలమైన నేతగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్క సంఘటనతో డ్యామేజ్ అవుతారు. బీజేపీలో బండి సంజయ్ బలమైన నేతగా ఉండేవారు. కానీ వాళ్ల కుమారుడి మీద వచ్చిన ఆరోపణలతో ఒక్కసారిగా పరిస్థితి ఎలా మారిందో చూస్తున్నాం.</p>



<p>బండి సంజయ్ కుమారుడి మీద వచ్చిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారో తెలంగాణ మహిళలు గమనిస్తున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసుల్లో కూడా అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ కు రేవంత్ రెడ్డి మేలు చేసి పెడుతున్నాడు. కచ్చితంగా ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అవసరమైనప్పుడు కచ్చితంగా తెలంగాణ మహిళలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారు. ఇవ్వాళ్టికి కూడా తెలంగాణలో రోజుకు మహిళలపై 7 రేప్ కేసులు నమోదవుతున్నాయి. బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో బాధితురాలి క్యారెక్టర్ ను తప్పు పట్టేలా మీడియాలో కథనాలు వేస్తున్నారు. మీడియా ట్రయల్ ద్వారా మహిళలకు నష్టం జరుగుతున్నది. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దు. తన కుమారుడి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రధానితో బండి సంజయ్ వేదిక పంచుకోవల్సింది కాదు. ఆయన కేంద్ర హోంమంత్రిగా పదవిలో ఉంటే విచారణ సజావుగా సాగదు. కనుక విచారణ పూర్తయ్యే వరకు పదవి నుంచి తప్పుకోవాలి. సమస్యను ఏ పార్టీ వాళ్లు హైలైట్ చేసినా అది మంచిదే. కానీ ప్రభుత్వం దీనిపై స్పందించాలి. విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ ను తప్పించాలని ప్రధానికి లెటర్ రాస్తాను.&#8221;&nbsp;</p>



<h2 class="wp-block-heading">బడే భాయ్..ఛోటే భాయ్</h2>



<p>&#8220;మోడీ, రేవంత్ రెడ్డి కలిసే ఉన్నారు. బడేభాయ్, చోటే భాయ్ కలిసే ఉన్నారు. అందుకే తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రాజెక్టులు రాకపోయినా సీఎం స్పందించటం లేదు. అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కాదు, ఆర్ఎస్ఎస్ సీఎం అని నేను అంటాను. అమ్మతనంతో పాలన జరిగినప్పుడే సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది. అక్కగా కన్నా కూడా అమ్మగా ఆలోచిస్తే ఇంకా ఎక్కువ మంచి చేయవచ్చు. అందుకే నేను అక్క నుంచి అమ్మగా పరిణతి చెందాలని అనుకుంటున్నాను. మెంటల్లీ ఛాలెంజుడు పిల్లలకు ఈ ప్రభుత్వం కనీసం పెన్షన్ ఇవ్వటం లేదు. అలాంటి పిల్లల తల్లితండ్రులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకే వాళ్ల కోసం మేము ప్రత్యేక కన్ సర్న్ చూపుతాం. కేర్ టేకర్స్ ను కూడా ఇస్తాం. ఆ విధంగా అమ్మగా ఆలోచిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. లీడర్ ను ఎప్పుడూ కూడా జెండర్ బేస్డ్ గా చూడవద్దు. అన్ని వర్గాలు తనవే అని అనుకున్నప్పుడు మాత్రమే లీడర్ ఎదగగలడు. మన ఆలోచన విధానం మారితే అన్నీ మారుతాయి. మన లక్ష్యం పెద్దగా ఉండాలి. లీడర్ గా ఎదగాలని అనుకుంటే సింహంగా ఆలోచించాలి. నాకు ఎన్టీఆర్, కేసీఆర్, ఇందిరాగాంధీ, సుష్మాస్వరాజ్, మార్గరేట్ థాచర్ ఇష్టమైన నాయకులు. జ్యోతిరావు పూలే కూడా నాకు చాలా స్ఫూర్తినిచ్చిన నాయకులు. నేను కూడా వాళ్ల మాదిరిగా గొప్ప నాయకురాలిగా ఎదగాలని అనుకుంటున్నా. తమిళనాడులో విజయ్ గెలిచినట్లు తెలంగాణలో మేము కూడా గెలుస్తాం. మన రాష్ట్రంలో గొప్ప నాయకులు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని మాటలు కూడా తప్పారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లు పార్లమెంటులో మన రాష్ట్రాన్ని అవమానిస్తున్నా పట్టించుకోలేదు. &#8220;</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-way2news-conclave-telangana/">K Kavitha Slams Revanth Reddy, Calls Him ‘RSS CM’ at Hyderabad Conclave</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Fulfilling Telangana Movement Aspirations Is Kavitha’s Mission: Suraarapu Krishnaveni</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-telangana-movement-social-justice-suraarapu-krishnaveni/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 13 May 2026 16:44:26 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23736</guid>

					<description><![CDATA[<p>ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే కవితక్క లక్ష్యం సూరారపు కృష్ణవేణి ఆత్మకూరు ఎస్ : తెలంగాణలో ఉద్యమ కారుల ఆకాంక్షలు నెరవేర్చడం,అణగారిన వర్గాల ప్రయోజనాలు సమకూర్చడం సామాజిక న్యాయ తెలంగాణ సాధించడం లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు పనిచేస్తున్నారని టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూరారపు కృష్ణవేణి అన్నారు,ఆత్మకూరు ఎస్ మండలం నెమికల్ లో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-telangana-movement-social-justice-suraarapu-krishnaveni/">Fulfilling Telangana Movement Aspirations Is Kavitha’s Mission: Suraarapu Krishnaveni</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే కవితక్క లక్ష్యం</h2>



<h2 class="wp-block-heading">సూరారపు కృష్ణవేణి</h2>



<p>ఆత్మకూరు ఎస్ : తెలంగాణలో ఉద్యమ కారుల ఆకాంక్షలు నెరవేర్చడం,అణగారిన వర్గాల ప్రయోజనాలు సమకూర్చడం సామాజిక న్యాయ తెలంగాణ సాధించడం లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు పనిచేస్తున్నారని టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూరారపు కృష్ణవేణి అన్నారు,ఆత్మకూరు ఎస్ మండలం నెమికల్ లో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆవిర్భవించిన టీ ఆర్ ఎస్ పార్టీ ఈ నెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు జెండా పండుగను జరుపుకోనుందని ప్రజల్లో చైతన్యం నిపుకుంటూ గ్రామ గ్రామాన జెండా పండుగను చేస్తున్నామని తెలిపారు,కవితక్క ఆదేశాల మేరకు ఊరూర పార్టీ నేతలు జెండా పండుగను విజయవంతం చేయాలని కోరారు, రాష్ట్రం లో రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడం లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కొనుగోలు కేంద్రాల్లో జరిగే అక్రమాలు అరికట్టాలని, రైతుకు మద్దతు ధర ఇవ్వడం తో పాటు మోసాలకు గురిచేయకుండా చూడాలని కోరారు ,ప్రభుత్వ వైఫల్యాలు ఎండ కడుతూ ప్రజలవైపున నిలబడి పోరాడుతామన్నారు ఈ కార్యక్రమం లో నాయకులు పాల్గొన్నారు</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-telangana-movement-social-justice-suraarapu-krishnaveni/">Fulfilling Telangana Movement Aspirations Is Kavitha’s Mission: Suraarapu Krishnaveni</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Farmers Facing Severe Hardships Due to Paddy Procurement Delays in Telangana: Suraarapu Krishnaveni</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/telangana-paddy-procurement-farmers-suraarapu-krishnaveni/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 13 May 2026 16:37:25 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23733</guid>

					<description><![CDATA[<p>రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోంది టీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుంది -సూరారపు కృష్ణవేణి (సూర్యాపేట): రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోందని, ప్రభుత్వం రైతులపై కక్ష కట్టినట్టు ఉందని టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూరారపు కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు 20 రోజులకు పైగా పడిగాపులు కాసే దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. బుధవారం ఆమె జిల్లాలోని ఆత్మకూరు ఎస్, చివ్వేంల మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/telangana-paddy-procurement-farmers-suraarapu-krishnaveni/">Farmers Facing Severe Hardships Due to Paddy Procurement Delays in Telangana: Suraarapu Krishnaveni</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోంది</h2>



<h2 class="wp-block-heading">టీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుంది</h2>



<h2 class="wp-block-heading">-సూరారపు కృష్ణవేణి</h2>



<p><strong>(సూర్యాపేట):</strong></p>



<p>రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోందని, ప్రభుత్వం రైతులపై కక్ష కట్టినట్టు ఉందని టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సూరారపు కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు 20 రోజులకు పైగా పడిగాపులు కాసే దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. బుధవారం ఆమె జిల్లాలోని ఆత్మకూరు ఎస్, చివ్వేంల మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అలసత్వ వైఖరి, అక్రమ పద్ధతులపై మండిపడ్డారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించే పంట అమ్ము కోవడానికి కూడా ఐకేపీ కేంద్రాల్లో సరైన వసతులు లేవని, ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు జరపకుండా రైతులను తిప్పు కంటున్నారని కనీస మద్దతు ధర లేదు, రైతు గోడు పట్టించు కాకుండా రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండ కడతామని అన్నారు, రైతులకు అండగా టీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే కొనుగోళ్లు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు ఉప్పలాచారి, లింగయ్య, నాగేందర్, గీత, శ్యామ్ నాయక్ పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/telangana-paddy-procurement-farmers-suraarapu-krishnaveni/">Farmers Facing Severe Hardships Due to Paddy Procurement Delays in Telangana: Suraarapu Krishnaveni</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Special Prayers Held for K Kavitha to Become Telangana Chief Minister at Dandumaisamma Temple</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-cm-special-pujas-dandumaisamma-temple-suryapet/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 13 May 2026 13:38:45 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23730</guid>

					<description><![CDATA[<p>కల్వకుంట్ల కవిత సీఎం కావాలంటూ ప్రత్యేక పూజలు దండుమైసమ్మ ఆలయంలో పూజలు చేసిన కృష్ణవేణి (ఆత్మకూరు ఎస్): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరి రాష్ట్రాన్ని ఒక తల్లిలా పరిపాలించాలని కోరుతూ సూర్యపేట జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు సూరారపు కృష్ణవేణి బుధవారం ఆత్మకూరు ఎస్ మండలం దండుమైసమ్మ ఆలయంలో ప్రత్యక పూజలు నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి ఆలయంలో కవిత పేర అర్చన చేయించి అమ్మ వారిని మొక్కుకున్నారు. [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-cm-special-pujas-dandumaisamma-temple-suryapet/">Special Prayers Held for K Kavitha to Become Telangana Chief Minister at Dandumaisamma Temple</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">కల్వకుంట్ల కవిత సీఎం కావాలంటూ ప్రత్యేక పూజలు</h2>



<h2 class="wp-block-heading">దండుమైసమ్మ ఆలయంలో పూజలు చేసిన కృష్ణవేణి</h2>



<p>(ఆత్మకూరు ఎస్):</p>



<p>తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరి రాష్ట్రాన్ని ఒక తల్లిలా పరిపాలించాలని కోరుతూ సూర్యపేట జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు సూరారపు కృష్ణవేణి బుధవారం ఆత్మకూరు ఎస్ మండలం దండుమైసమ్మ ఆలయంలో ప్రత్యక పూజలు నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి ఆలయంలో కవిత పేర అర్చన చేయించి అమ్మ వారిని మొక్కుకున్నారు. కవితక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని, ప్రజలకు సుభిక్ష పాలన అందించాలని, రాజకీయ భవిష్యత్ బంగారు మయం కావాలని దండు మైసమ్మ తల్లి కోరుకున్నామని కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కృష్ణవేణికి అమ్మవారి ఆశీర్వచనం అందించి, చీరను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ మండలం నాయకులు గజవెల్లి ఉప్పలాచారి, గీత, గుండాల లింగయ్య, చింతకుంట్ల నాగేందర్ పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-cm-special-pujas-dandumaisamma-temple-suryapet/">Special Prayers Held for K Kavitha to Become Telangana Chief Minister at Dandumaisamma Temple</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Kavitha Slams Modi, Demands Action Against Bandi Bhagirath and National Status for Palamuru Project</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-telangana-water-rights-bandi-bhagirath-palamuru-project/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 13 May 2026 08:31:35 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23727</guid>

					<description><![CDATA[<p>తెలంగాణకు పొదుపు సూత్రాలు.. ఆంధ్రాకు పైసలు.. ఇదేనా ప్రధాని నీతి పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు మేము అధికారంలోకి వస్తే సాగుయోగ్యమైన ప్రతి గుంట కు నీళ్లు ఇస్తాం బండి భగీరథ్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి -టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (తెలంగాణ రక్షణ సేన కార్యాలయం, బంజారాహిల్స్) కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దేశం దాటి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-telangana-water-rights-bandi-bhagirath-palamuru-project/">Kavitha Slams Modi, Demands Action Against Bandi Bhagirath and National Status for Palamuru Project</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">తెలంగాణకు పొదుపు సూత్రాలు.. ఆంధ్రాకు పైసలు..</h2>



<h2 class="wp-block-heading">ఇదేనా ప్రధాని నీతి</h2>



<h2 class="wp-block-heading">పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు</h2>



<h2 class="wp-block-heading">మేము అధికారంలోకి వస్తే సాగుయోగ్యమైన ప్రతి గుంట కు నీళ్లు ఇస్తాం</h2>



<h2 class="wp-block-heading">బండి భగీరథ్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి</h2>



<h2 class="wp-block-heading">-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<p><strong>(తెలంగాణ రక్షణ సేన కార్యాలయం, బంజారాహిల్స్)</strong></p>



<p>కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దేశం దాటి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. ప్రధాని మోడీ వచ్చి తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పి ఆంధ్రాకు మాత్రం పైసలు ఇచ్చారని విమర్శించారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఘాటు విమర్శలు చేశారు.</p>



<h2 class="wp-block-heading">పారదర్శక విచారణ అవసరం</h2>



<p>&#8220;కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.&nbsp; అలాంటి సందర్భంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న వేదికను బండి సంజయ్ పంచుకోవటం శోచనీయం. కుటుంబ సభ్యులపై అంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ ఆ మీటింగ్ కు వెళ్లాల్సింది కాదు. దాని కారణంగా పెద్ద వాళ్ల పిల్లలు ఏమీ తప్పుచేసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తారనే భావన ప్రజల్లోకి వెళ్లింది.</p>



<p>ఏ ఆరోపణలు వచ్చినా సరే ముందుగా నిందితులను దేశం దాటించటం బీజేపీకి అలవాటు. వెంటనే బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేయాలి. అప్పుడు మాత్రమే పారదర్శకంగా విచారణ జరుగుతుందని ప్రజలకు విశ్వాసం వస్తుంది. కొన్ని పార్టీల వాళ్లు ఒక ట్వీట్ వేసి మొత్తం సమస్యను పరిష్కరించినట్లు చేస్తున్నారు. వాళ్లు నేను ఎందుకు స్పందించటం లేదంటూ నానా హంగామా చేస్తున్నారు. కానీ ఒక ఆడపిల్ల అంశం వచ్చినప్పుడు చాలా సంయమనంగా వ్యవహరించాలి. అందులోనూ అమ్మాయి మైనర్ అయినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి.&nbsp;</p>



<p>ఎందుకంటే ఈ సమాజం మగ పిల్లవాళ్లను క్షమిస్తుంది. కానీ ఆడపిల్లలను మాత్రం క్షమించదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయి. దీని కారణంగా ఆ అమ్మాయి జీవితం నష్టపోయే ప్రమాదం ఉంది. వాటిని పోస్ట్ చేసిన ఖాతాలను గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. మేము ఎప్పుడైనా సరే ఆడపిల్లల పక్షమే. వారికి అండగా ఉంటూనే ఉంటాం. &#8220;</p>



<h2 class="wp-block-heading">జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలి</h2>



<p>&#8220;ప్రధాని మోడీ వచ్చి తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పారు. ఆంధ్రాకు మాత్రం పైసలు ఇచ్చారు. మహిళా బిల్లు మీద కనీసం ఏమీ మాట్లాడలేదు. మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా పెట్టాలి. జనగణనలో ఇళ్ల లెక్క అయిపోయింది. ఇక జనగణన ఉంటుంది. అందుకే కచ్చితంగా వాటిలో ఓబీసీ కాలం పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కులంతో పాటు ఉపకులం, సామాజిక స్థితిగుతులను పరిగణలోకి తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్ల కోసం మేము చేసిన రైల్ రైకో కారణంగా ఇవ్వాళ కోర్టుకు వెళ్తున్నాం.&#8221;&nbsp;</p>



<h2 class="wp-block-heading">జాతీయహోదా కోసం అడగరా..</h2>



<p>&#8220;పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం న్యాయబద్ధమైన డిమాండ్ ను మేము చేస్తూనే ఉన్నాం. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారుతున్నా సరే మహబూబ్ నగర్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిస్థితే ఉన్న అప్పర్ భద్రకు మాత్రం జాతీయ హోదా ఇచ్చారు. మనకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి మాట్లాడాలి. ప్రధానికి జాతీయ హోదా కోసం లెటర్ రాయాలి. మనకు జాతీయ హోదా కోసం పట్టుపట్టాలి. పుష్కరాల నాటికి పోలవరం పూర్తి కావాలంటూ కేంద్ర ఇరిగేషన్ మంత్రి వద్దకు చంద్రబాబు వెళ్లారు. మీ గురువును చూసైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ వద్దకు ఐదుసార్లు ఆయన వెళ్లారు. పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.&nbsp;</p>



<p>కానీ రేవంత్ మాత్రం ఒక్కసారి కూడా పాలమూరు ప్రాజెక్ట్ వద్దకు వెళ్లలేదు. రివ్యూ చేయలేదు. మాట్లాడితే నల్లమల పులిని అని చెప్పుకునే మీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతున్నది. పవర్ ప్రాజెక్ట్ అయిన శ్రీశైలంలో కూడా 331 టీఎంసీలు వాడుకునేలా ఆంధ్రావాళ్లు వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. గోదావరిలో 964 టీఎంసీల నీళ్లు వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ మనం 220 టీఎంసీలు మాత్రమే వాడుకున్నాం. దీన్ని బట్టే నీళ్ల విషయంలో ఆంధ్రావాళ్లతో పోల్చుకుంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ప్రాజెక్టు వద్ద మూడు అల్టర్ నేట్ లు పెట్టుకున్నారు. సుంకేశులను బారాజ్ చేసుకున్నారు. చెన్నైకి నీళ్లు అని చెప్పి అక్కడకు వెళ్లే కాలువలను డబుల్ చేసుకున్నారు. శ్రీశైలంలో బురద నీళ్లను కూడా తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నారు. &#8220;</p>



<h2 class="wp-block-heading">నీటి వినియోగంలో వైఫల్యం</h2>



<p>&#8220;మనం 1.89 లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారీగా ఖర్చు చేస్తున్నది. కానీ గోదావరిలో 25 శాతం, కృష్ణాలో 50 శాతం నీళ్లను కూడా మనం వాడుకోలేదు. అందుకే మేము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. వాటర్ కమిషన్ ను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో నీటి నిర్వహణ అంతా వాటర్ కమిషనే చూసుకుంటుంది. సాగు యోగ్యమైన ప్రతి గుంటకు కూడా నీళ్లు ఇస్తాం. ప్రతి మూడు వేల ఎకరాలకు ఒక లష్కర్ ను నియమిస్తాం. మన రాష్ట్రంలో ఉన్న అనేక చిన్న నదులపై ఎక్కడికక్కడ వందేళ్లు బలంగా ఉండే గేట్లతో కూడిన చెక్ డ్యామ్ లు ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసినట్లు కొట్టుకుపోయే చెక్ డ్యామ్ లను కాకుండా పటిష్టమైన చెక్ డ్యామ్ లను నిర్మిస్తాం. కృష్ణా నదిలో&nbsp; 771 టీఎంసీలను ఆంధ్రావాళ్లు వాడుకున్నారు. మనం వాటా మొత్తం వాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరముంది. ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ కనీసం ఒక్క ప్రశ్న కూడా ఎందుకు అడగలేదు. మన రాష్ట్రాన్నే నీళ్ల కోసం ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో 16 రాష్ట్రాల్లో జాతీయ హోదా ప్రాజెక్టులు ఇచ్చినట్లు మనకు కూడా ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లులను కేంద్రం ఆమోదించేలా చర్యలు చేపట్టాలి.&nbsp;</p>



<p>బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరిగి మా వంతు ప్రయత్నం చేస్తాం. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు మేము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాశాం.&nbsp;</p>



<p>ఆ లేఖనే రిట్ పిటిషన్ గా వేసి న్యాయపోరాటం కూడా చేస్తాం. కేంద్ర ఇరిగేషన్ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి తెలంగాణ ప్రాజెక్ట్ ల కోసం మాట్లాడుతాం. &#8220;</p>



<h2 class="wp-block-heading">20 నుంచి జెండాపండుగ</h2>



<p>&#8220;నీట్ పేపర్ లీక్ అవటం బాధాకరం. పది రూపాయల డైపర్ లీక్ అవటం లేదు. నీట్ పేపర్ మాత్రం లీక్ అవుతోంది.&nbsp;</p>



<p>ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అయిన మన విద్యార్థులను కేంద్రం బాధపెడుతోంది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా పేపర్ లీక్ అవటం బాధాకరం. తెలంగాణలో రాజకీయ శూన్యతను ప్రశ్నించేందుకు తెలంగాణ రక్షణ సేన ఏర్పడింది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు జెండా పండుగ నిర్వహిస్తాం. నేను కూడా పలు చోట్ల జెండా పండుగ కార్యక్రమానికి హాజరవుతాను. జెండా పండుగ మా పార్టీ నిర్మాణానికి పునాది. జెండా పండుగ నిర్వహణ ద్వారా పదవులు ఇస్తాం.&#8221;</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-telangana-water-rights-bandi-bhagirath-palamuru-project/">Kavitha Slams Modi, Demands Action Against Bandi Bhagirath and National Status for Palamuru Project</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>K. Kavitha to Appear Before Secunderabad Railway Court in Rail Roko Case</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-secunderabad-railway-court-rail-roko-case/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 13 May 2026 06:27:09 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23724</guid>

					<description><![CDATA[<p>సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరు కానున్న టీఆర్ఎస్ చీఫ్ రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితకు సమన్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన కల్వకుంట్ల కవిత (హైదరాబాద్) 2025 నవంబర్ లో రైల్ రోకో నిర్వహించిన కేసులో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరుకానున్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-secunderabad-railway-court-rail-roko-case/">K. Kavitha to Appear Before Secunderabad Railway Court in Rail Roko Case</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరు కానున్న టీఆర్ఎస్ చీఫ్</h2>



<h2 class="wp-block-heading">రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితకు సమన్లు</h2>



<h2 class="wp-block-heading">బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన కల్వకుంట్ల కవిత</h2>



<p><strong>(హైదరాబాద్)</strong></p>



<p>2025 నవంబర్ లో రైల్ రోకో నిర్వహించిన కేసులో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరుకానున్నారు.<br>బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన కవితపై రైల్వే చట్టం కింద కేసులు నమోదు చేశారు. రైల్ రోకో కేసులో కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ లోని రెండవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో చేపట్టారు.. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బీసీ బిల్లులకు వెంటనే ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. కల్వకుంట్ల కవితతో పాటు రైల్ రోకో చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.<br>కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైల్ రోకో కారణంగా సిర్నపల్లి–ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్ లో ప్రయాణిస్తున్న మరో గూడ్స్ రైలును నిలిపివేశారు.<br>రైల్ రోకో చేపట్టిన కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మంది నాయకులపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్ర బాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కవితతో పాటు 12 మంది టీఆర్ఎస్ నాయకులపై U/Sec.147&amp;74(a) Railway Act కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సికింద్రాబాద్ రైల్వేస్ సెకండ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసెస్ కోర్టు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-secunderabad-railway-court-rail-roko-case/">K. Kavitha to Appear Before Secunderabad Railway Court in Rail Roko Case</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Kalvakuntla Kavitha Calls for Month-Long TRS Flag Festival Across Telangana</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-calls-for-month-long-trs-flag-festival-in-telangana/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Mon, 11 May 2026 08:27:28 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23721</guid>

					<description><![CDATA[<p>నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ రాష్ట్ర రాజధాని నుంచి వార్డు స్థాయి వరకు పార్టీ జెండాలు ఆవిష్కరించాలి పార్టీ శ్రేణులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపు &#8220;తెలంగాణ రక్షణ సేన&#8221; పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి జూన్ 20 [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-calls-for-month-long-trs-flag-festival-in-telangana/">Kalvakuntla Kavitha Calls for Month-Long TRS Flag Festival Across Telangana</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ</h2>



<h2 class="wp-block-heading">రాష్ట్ర రాజధాని నుంచి వార్డు స్థాయి వరకు పార్టీ జెండాలు ఆవిష్కరించాలి</h2>



<h2 class="wp-block-heading">పార్టీ శ్రేణులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపు</h2>



<p>&#8220;తెలంగాణ రక్షణ సేన&#8221; పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర రాజధాని మొదలు జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున జెండా పండుగ నిర్వహించాలని సూచించారు. అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, పాంచజన్య లక్ష్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మన తెలంగాణ గడ్డ అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని,&nbsp;</p>



<p>తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు &#8211; నిధులు &#8211; నియామకాలను సాకారం చేసుకోవడంలోనూ వంచనకు గురయ్యామన్నారు.&nbsp;</p>



<p>వలస పాలన నాటి దుష్పరిణామాలను తెలంగాణ ప్రజలు ఇప్పుడు మళ్లీ ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు మారుతాయని అనుకున్న ప్రతివర్గం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నదని కవిత చెప్పారు. స్వరాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన మనం తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు.</p>



<p>అందుకే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపారు.</p>



<p>పార్టీ ఆవిర్భావానికి మూడు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున పార్టీలో చేరిన నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి నాయకత్వం జెండా పండుగను విజయవంతం చేయాలని&nbsp; కవిత పిలుపునిచ్చారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-calls-for-month-long-trs-flag-festival-in-telangana/">Kalvakuntla Kavitha Calls for Month-Long TRS Flag Festival Across Telangana</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Kavitha Backs Telangana Activists, Sets June 2 Deadline for Congress Government</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-supports-telangana-activists-june-2-deadline/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Mon, 11 May 2026 05:08:46 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=23717</guid>

					<description><![CDATA[<p>తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు తెలంగాణ ఉద్యమకారుల సంఘాలతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశం హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ 2 వరకు గడువు అవసరమైతే ఉద్యమకారులతో కలిసి ఆందోళన (బంజారాహిల్స్ &#8211; తెలంగాణ రక్షణ సేన కార్యాలయం) తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. ఉద్యమకారుల సంఘాల సమావేశానికి హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారుకాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలకు జూన్ [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-supports-telangana-activists-june-2-deadline/">Kavitha Backs Telangana Activists, Sets June 2 Deadline for Congress Government</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు</h2>



<h2 class="wp-block-heading">తెలంగాణ ఉద్యమకారుల సంఘాలతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశం</h2>



<h2 class="wp-block-heading">హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ 2 వరకు గడువు</h2>



<h2 class="wp-block-heading">అవసరమైతే ఉద్యమకారులతో కలిసి ఆందోళన</h2>



<p><strong>(బంజారాహిల్స్ &#8211; తెలంగాణ రక్షణ సేన కార్యాలయం)</strong></p>



<p>తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. ఉద్యమకారుల సంఘాల సమావేశానికి హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు<br>కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలకు జూన్ 2 వరకు గడువు ఇస్తున్నామని అప్పటికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమకారులతో కలిసి ప్రక్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఝార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులకు అందిస్తున్న సంక్షేమ పథకాల తరహాలో తెలంగాణలో ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భువనగిరి జిల్లా కేంద్రంలో సభ నిర్వహించాలని, భూ పోరాటాలు ఉద్ధృతం చేయాలని, జిల్లాల వారిగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్, మలి దశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సామ అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు మూల ప్రభాకర్ గౌడ్, కార్యదర్శులు వెలమల రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు బోగి పద్మ, నాయకులు గుస్సా రవీందర్, అరుణ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు పూస శ్రీనివాస్, కొడిమల కృష్ణ, డీఎస్ మాణిక్యమ్మ, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రామగిరి ప్రకాశ్, ఉపాధ్యక్షులు బీరకాయల మధుసూదన్, భరత్ రెడ్డి, తొలి దశ ఉద్యమకారుల సంఘం ఉపాధ్యక్షులు సాజిద సికిందర్, శ్రీవల్లి, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.</p>



<p>సమావేశం అనంతరం ఉద్యమకారులతో కలిసి కల్వకుంట్ల కవిత సహపంక్తి భోజనం చేశారు</p>



<figure class="wp-block-image size-large"><img fetchpriority="high" decoding="async" width="1024" height="375" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/05/kavitha-supports-telangana-activists-june-2-deadline-1-1024x375.jpeg" alt="Kavitha backed Telangana activists’ demands and set a June 2 deadline for the Congress government to implement promised welfare measures." class="wp-image-23718" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/05/kavitha-supports-telangana-activists-june-2-deadline-1-1024x375.jpeg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/05/kavitha-supports-telangana-activists-june-2-deadline-1-300x110.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/05/kavitha-supports-telangana-activists-june-2-deadline-1-768x282.jpeg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/05/kavitha-supports-telangana-activists-june-2-deadline-1-1536x563.jpeg 1536w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/05/kavitha-supports-telangana-activists-june-2-deadline-1-2048x751.jpeg 2048w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-supports-telangana-activists-june-2-deadline/">Kavitha Backs Telangana Activists, Sets June 2 Deadline for Congress Government</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
