<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Telangana Jagruthi</title>
	<atom:link href="https://www.telanganajagruthi.org/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://www.telanganajagruthi.org/</link>
	<description></description>
	<lastBuildDate>Sat, 15 Aug 2026 16:48:42 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=7.0.4</generator>

<image>
	<url>https://www.telanganajagruthi.org/wp-content/uploads/2025/10/favicon-150x150.png</url>
	<title>Telangana Jagruthi</title>
	<link>https://www.telanganajagruthi.org/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>Kalvakuntla Kavitha Demands British Apology to Indians, Return of Kohinoor </title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-british-apology-independence-day-2026/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Sat, 15 Aug 2026 16:36:25 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24241</guid>

					<description><![CDATA[<p>భారతీయులకు బ్రిటన్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి కొళ్లగొట్టిన మన సంపదను తిరిగి ఇచ్చేయాలి బ్రిటన్ చరిత్ర పుస్తకాల్లో భారత్ పై ఉన్న అసత్యాలను సరి చేయాలి -తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ (తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) రెండు వందల ఏళ్ల పాటు భారతీయులపై చేసిన అఘాయిత్యాలకు బ్రిటన్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-british-apology-independence-day-2026/">Kalvakuntla Kavitha Demands British Apology to Indians, Return of Kohinoor </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">భారతీయులకు బ్రిటన్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి</h2>



<h2 class="wp-block-heading">కొళ్లగొట్టిన మన సంపదను తిరిగి ఇచ్చేయాలి</h2>



<h2 class="wp-block-heading">బ్రిటన్ చరిత్ర పుస్తకాల్లో భారత్ పై ఉన్న అసత్యాలను సరి చేయాలి</h2>



<h2 class="wp-block-heading">-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<h2 class="wp-block-heading">80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)</strong></p>



<p class="wp-block-paragraph">రెండు వందల ఏళ్ల పాటు భారతీయులపై చేసిన అఘాయిత్యాలకు బ్రిటన్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కవిత మాట్లాడారు. మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎంతో మంది మన పూర్వీకుల త్యాగాల పోరాట ఫలితమన్నారు. మన చరిత్రను గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలని, చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్ ను చక్కగా నిర్మించగలరని అన్నారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">కొహినూర్ సహా మన సంపద తిరిగి ఇచ్చేయాలి</h2>



<p class="wp-block-paragraph">జలియన్ వాలా బాగ్ ఘటనలో వందలాది మందిని పొట్టనబెట్టుకున్నారన్నారు. కృత్రిమ కరువు తీసుకొచ్చి వేలాది మంది చావులకు కారణమయ్యారన్నారు. రెండు ప్రపంచ యుద్ధాలకు మన సైనికులను తీసుకెళ్లి స్వాతంత్ర్యం ఇస్తామని మాట ఇచ్చిన తప్పిన విషయాన్ని గుర్తు చేశారు. శాంతియుతంగా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మనవాళ్లపై ఎన్నో అరాచకాలకు పాల్పడిన బ్రిటీష్ వాళ్ల చరిత్ర మనం తెలుసుకోవాలని కవిత అన్నారు. రెండు వందల ఏళ్ల పాటు మనపై జరిపిన అరాచకాలకు బ్రిటీష్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మన దేశం నుంచి దోచుకెళ్లిన కోహినూర్ వజ్రంతో పాటు సంపదను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలంలో ఒకే భూభాగంగా ఉన్న భారత్, పాకిస్తాన్ లను ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండానే విభజించి, రెండు దేశాల మధ్య శాశ్వత వైరుధ్యాలు తీసుకువచ్చారని అన్నారు. అలాంటి బ్రిటీష్ వాళ్ల కల్చర్ ను, ఇంగ్లీష్ మాట్లాడటాన్నే ఇప్పటికీ కూడా గొప్ప అన్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్ల తోలు గొప్ప, నల్ల తోలు కాదన్నట్లుగా విభజించి పాలించారని అన్నారు. బ్రిటీష్ పాలన నాటి ఆనవాళ్ల నుంచి మనం బయటపడాల్సిన అవసరముందని చెప్పారు. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోని భవిష్యత్ తరాలకు వాటిని అందించాలన్నారు. చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్ ను నిర్మించగలరన్నారు. బ్రిటన్ పాఠ్య పుస్తకాల్లో తప్పుగా రాసిన చరిత్రను మార్చాలని డిమాండ్ చేశారు.</p>



<h2 class="wp-block-heading">స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను పిల్లలకు చెప్పాలి</h2>



<p class="wp-block-paragraph">బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి మన దేశంలో పోరాటం కొనసాగిందని గుర్తు చేశారు. ఎంతో మంది మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు. ఈ పోరాటంలో ఎన్నో సార్లు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ పట్టు వదలకుండా చేసిన ఉద్యమం కారణంగానే మనకు స్వాతంత్ర్యం సిద్దించిందని అన్నారు. వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. స్వతంత్ర ఉద్యమంలో జరిగిన పోరాటాన్ని కచ్చితంగా మన పిల్లలకు వివరించాలని పిలుపునిచ్చారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-british-apology-independence-day-2026/">Kalvakuntla Kavitha Demands British Apology to Indians, Return of Kohinoor </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>TRS Party Leader Naveen Kumar Warns of Threat to Telangana Water Rights Over Godavari </title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/telangana-water-rights-godavari-grmb-banakacherla/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Thu, 13 Aug 2026 16:47:56 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24244</guid>

					<description><![CDATA[<p>కృష్ణాను చెరబట్టిన ఏపీ గోదావరిని కొల్లగొట్టాలని కుట్రలు చేస్తున్నది జీఆర్ఎంబీ మీటింగ్ వేదిక తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నాలు ఇప్పటికే అనుమతులిచ్చిన ఏడు ప్రాజెక్టుల పర్మిషన్ లను రివ్యూ చేయాలనడం దుర్మార్గం ఇంత జరుగుతున్నా నది జలాల పంపిణీపై అవగాహన లేని ముఖ్యమంత్రి గప్ చుప్ గా ఉంటున్నాడు టీఆర్ఎస్ ప్రశ్నించే వరకూ అధికార, ప్రతిపక్షాలకు సోయే లేదు -తెలంగాణ రక్షణసేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్ (తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) : కృష్ణా నదిని [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/telangana-water-rights-godavari-grmb-banakacherla/">TRS Party Leader Naveen Kumar Warns of Threat to Telangana Water Rights Over Godavari </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">కృష్ణాను చెరబట్టిన ఏపీ గోదావరిని కొల్లగొట్టాలని కుట్రలు చేస్తున్నది</h2>



<h2 class="wp-block-heading">జీఆర్ఎంబీ మీటింగ్ వేదిక తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నాలు</h2>



<h2 class="wp-block-heading">ఇప్పటికే అనుమతులిచ్చిన ఏడు ప్రాజెక్టుల పర్మిషన్ లను రివ్యూ చేయాలనడం దుర్మార్గం</h2>



<h2 class="wp-block-heading">ఇంత జరుగుతున్నా నది జలాల పంపిణీపై అవగాహన లేని ముఖ్యమంత్రి గప్ చుప్ గా ఉంటున్నాడు</h2>



<h2 class="wp-block-heading">టీఆర్ఎస్ ప్రశ్నించే వరకూ అధికార, ప్రతిపక్షాలకు సోయే లేదు</h2>



<h2 class="wp-block-heading">-తెలంగాణ రక్షణసేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :</strong></p>



<p class="wp-block-paragraph">కృష్ణా నదిని చెరబట్టిన ఏపీ ఇప్పుడు గోదావరి నీళ్లను కొళ్లగొట్టేందుకు కుట్రలు చేస్తోందని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు చేసిన అన్యాయం చాలదన్నట్లుగా రాష్ట్రం వీడిపోయిన తర్వాత కూడా కూడా ఏపీ నాయకులు అవే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నదిలో 273 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకునేందుకు ఏపీ కుట్రలు చేస్తోందన్నారు. ఈ నెల 18 న గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ వేదికగా తెలంగాణ నీటి హక్కులను లాక్కునే కుట్రలకు తెరలేపిందని అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా నీళ్ల వాటా విషయంలో ఏపీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు గతంలో ఎప్పుడో ఇచ్చిన ఏడు ప్రాజెక్ట్ ల అనుమతులను కూడా రివ్యూ చేసి రద్దు చేయాలంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసిందని చెప్పారు. ఇంత జరుగుతుంటే నీళ్ల విషయంలో సోయి లేని ప్రభుత్వం, నదీ జలాల పంపిణీ పై అవగాహన లేని ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండిపోయారని అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం ఈ అంశంలో గప్ చుప్ అయ్యిందని మండిపడ్డారు. ఏపీ కుట్రలను పది రోజుల క్రితమే గమనించి తమ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ముందుగా హెచ్చరించారని నవీన్ చెప్పారు. ఆ తర్వాత సోయిలోకి వచ్చిన బీఆర్ఎస్ తామే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉండి కృష్ణా నీళ్లను ఏపీ ప్రభుత్వం దోచుకెళ్తుంటే కిక్కురుమనని బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మరని చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎంతదూరమైన కొట్లాడుతామని, క్రెడిట్ చోరీ ప్రయత్నాలు చేయకుండా నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేస్తామని నవీన్ చెప్పారు.&nbsp;&nbsp;</p>



<h2 class="wp-block-heading">తెలంగాణ నీటి హక్కులపై ఏపీ కుట్రలు</h2>



<p class="wp-block-paragraph">నీటి హక్కుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం మళ్లీ పావులు కదుపుతోందని నవీన్ మండిపడ్డారు. గతంలో తెలంగాణకు చేసిన అన్యాయం చాలదన్నట్లుగా మళ్లీ అవే కుట్రలు చేస్తున్నారని వివరాలతో సహా బయటపెట్టారు. గతంలో కృష్ణా నీళ్లలో పెద్ద ఎత్తున అన్యాయం చేస్తే ఇప్పుడు గోదావరి నీళ్లపై కన్నేశారన్నారు. గోదావరి నదిలో 273 టీఎంసీల నీళ్లపై అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నవీన్ చెప్పారు. ఇందుకోసం ఈ నెల 18 న జరగనున్న గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ వేదికగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ నీటి హక్కులను లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. పైగా గతంలో ఎప్పుడో తెలంగాణ ప్రాజెక్ట్ లు ఏడింటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసిందని ఆయన చెప్పారు. తుమ్మిడి హెట్టి, కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం, చౌట్ పల్లి హన్మంత రెడ్డి ప్రాజెక్ట్, చనాకా కొరాట బ్యారేజ్, మోడికుంట వాగు, కడెం &#8211; గూడెం లిఫ్ట్, సీతమ్మ సాగర్ &#8211; సీతారామ ఎత్తిపోతలకు ఇచ్చిన అనుమతులపై రివ్యూ చేయాలని, సమ్మక్క సాగర్ బ్యారేజీకి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలో పేర్కొన్నదని తెలిపారు. వీటిలో చాలా ప్రాజెక్ట్ లు దాదాపు పూర్తయ్యాయని వాటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ లేఖలు రాసే అధికారం ఏపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్ట్ లకు అనుమతులు రద్దు చేయాలని కోరితే ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తుందా అని నిలదీశారు. ఏపీ చెప్పిన అభ్యంతరాలను జీఆర్ఎంబీ తన ఎజెండాలో పెట్టటం అన్యాయమని నవీన్ అన్నారు. ఏపీకి హక్కుగా వచ్చే 480 టీఎంసీ లు వాళ్లు వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని కానీ తెలంగాణ నీటి హక్కులపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">ముఖ్యమంత్రి స్పందించకపోవటం దుర్మార్గం</h2>



<p class="wp-block-paragraph">నీళ్ల సోయి లేని కాంగ్రెస్ ప్రభుత్వం, నదీ జలాల పంపిణీ పై అవగాహన లేని ముఖ్యమంత్రిగా కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలో కలిసే నీళ్లను ఏపీ వాడుకుంటే నష్టమేమిటని ముఖ్యమంత్రి మాట్లాడటం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కృష్ణా, పెన్నా బేసిన్ లోని ప్రాజెక్ట్ లకు 250 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రభుత్వం గోదావరి – బనకచర్ల లింక్ చేపడుతుందని, దానికి తెలంగాణ సీఎం వంత పాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని చిన్న ప్రాజెక్టులపై ఏపీ విషం చిమ్ముతుంటే.. మన ప్రభుత్వం ఏపీ అక్రమ ప్రాజెక్టుల విషయంలో ఉదారంగా వ్యవహరించడం మన హక్కులను కాలరాయడమేనన్నారు. ఇన్నాళ్లు గోదావరి నీళ్లను ఎత్తిపోసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మేల్కొని నీళ్లను ఎత్తిపోస్తామని చెబుతోందన్నారు. కానీ ఏపీ చేస్తున్న కుట్రల కారణంగా గోదావరి నదిలో కూడా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయమే మళ్లీ ఇప్పుడు జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఏపీ కుట్రలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఏపీ మాటలు విని తుమ్మడిహెట్టి పై జీఆర్ఎంబీ ఏ విధంగా అభ్యంతరం చెబుతుందని ప్రశ్నించారు. ఏపీ చేస్తున్న అన్యాయన్ని ముందుగా గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించింది టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవితేనని గుర్తు చేశారు. తాము హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చి రివ్యూ మీటింగ్ లు నిర్వహించటం మొదలు పెట్టారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">క్రెడిట్ చోరీకి బీఆర్ఎస్ యత్నం</h2>



<p class="wp-block-paragraph">తెలంగాణకు ఏపీ ఇంత అన్యాయం చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన బీఆర్ఎస్ గప్ చుప్ గా ఉందని నవీన్ అన్నారు. పది రోజుల క్రితమే టీఆర్ఎస్ ఈ అంశాన్ని వెలుగులోకి తేవడంతో మేల్కొన్న బీఆర్ఎస్ నాయకులు అప్పుడు ఈ అంశంపై మాట్లాడటం స్టార్ట్ చేశారన్నారు. పైగా తమ కారణంగానే ప్రభుత్వంలో కదలిక వచ్చిందంటూ క్రెడిట్ చోరీకి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కృష్ణా నీటిలో అన్యాయం జరగటానికి బీఆర్ఎస్ కారణం కాదా అని నవీన్ ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పేరుతో పెద్ద ఎత్తున ఏపీ మన నీటిని దోపిడీ చేస్తుంటే ఏడాది పాటు కిక్కురుమనకుండా కూర్చుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. ఏపీ నీటి దోపిడీకి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా వత్తాసు పలుకుతుందన్నారు. బీఆర్ఎస్ క్రెడిట్ చోరీ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఎన్ని డ్రామాలు చేసిన మీ నిజ స్వరూపం ప్రజలకు తెలుసని అన్నారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">కేంద్రానికి జల విధానం లేదా?</h2>



<p class="wp-block-paragraph">ఏపీ తానా అంటే కేంద్రం తందానా అంటుందని నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి గురించి అభ్యంతరం చెబితే జీఆర్ఎంబీ తన అజెండాలో ఆ అంశాన్ని ఎలా పెడుతుందని ఆయన ప్రశ్నించారు. గోదావరి నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారని నిలదీశారు. ఓ వైపు తుపాకుల గూడెం వద్ద నుంచి గోదావరి, కృష్ణా రివర్ లింక్ చేపట్టాలని అంటూనే మళ్లీ ఏపీ చెప్పిన అభ్యంతరాలపై సమాధానం చెప్పాలని ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. అసలు కేంద్రానికంటూ ఒక జలవిధానం లేదా అని నవీన్ అడిగారు. తెలంగాణ నీటి విషయంలో వచ్చే హక్కులను కేంద్రమే కాపాడాలని కోరారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">తెలంగాణకు అన్యాయం జరగనివ్వం</h2>



<p class="wp-block-paragraph">నీటి హక్కుల విషయంలో ఏపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని నవీన్ చెప్పారు. తెలంగాణ ప్రాజెక్ట్ లపై ఏపీ చెప్పిన అభ్యంతరాల మాదిరిగానే ఏపీ ప్రాజెక్ట్ లపై తాము అభ్యంతరం చెబుతామన్నారు. ఒక పార్టీగా అదే విధంగా పౌర సమాజం నుంచి కూడా లక్షలాదిగా కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాస్తామన్నారు. నీటి హక్కుల విషయంలో క్రెడిట్ చోరీ పై దృష్టి పెట్టకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తామన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/telangana-water-rights-godavari-grmb-banakacherla/">TRS Party Leader Naveen Kumar Warns of Threat to Telangana Water Rights Over Godavari </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Telangana Auto Drivers Protest Over Electric Autos, Demand Withdrawal of GO 263</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/telangana-auto-drivers-protest-go-263-electric-autos/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 12 Aug 2026 12:58:51 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24236</guid>

					<description><![CDATA[<p>ఆటో కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్టకట్టలేవు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి లేదంటే 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతర పెడ్తరు టీఆర్టీయూ అనుబంధ ఆటో కార్మికుల సంఘం నాయకుల హెచ్చరిక ధర్నా చౌక్ లో డ్రైవర్ల దీక్ష..&#160; మహాధర్నా (తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) : ఆటో కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వానికి కూడా బతికి బట్టకట్టిన చరిత్ర లేదని తెలంగాణ రక్షణ సేన కార్మిక విభాగం టీఆర్టీయూ [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/telangana-auto-drivers-protest-go-263-electric-autos/">Telangana Auto Drivers Protest Over Electric Autos, Demand Withdrawal of GO 263</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">ఆటో కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్టకట్టలేవు</h2>



<h2 class="wp-block-heading">ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి</h2>



<h2 class="wp-block-heading">లేదంటే 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతర పెడ్తరు</h2>



<h2 class="wp-block-heading">టీఆర్టీయూ అనుబంధ ఆటో కార్మికుల సంఘం నాయకుల హెచ్చరిక</h2>



<h2 class="wp-block-heading">ధర్నా చౌక్ లో డ్రైవర్ల దీక్ష..&nbsp; మహాధర్నా</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :</strong></p>



<p class="wp-block-paragraph">ఆటో కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వానికి కూడా బతికి బట్టకట్టిన చరిత్ర లేదని తెలంగాణ రక్షణ సేన కార్మిక విభాగం టీఆర్టీయూ నేతలు అన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోలు నడిపించాలన్న నిర్ణయం ఆటో కార్మికుల జీవితాలను ఆగం చేస్తుందన్నారు. వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) అనుబంధ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఆటో కార్మికులకు అన్యాయం చేసే 263 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 20 మంది ఆటో కార్మికులు దీక్ష చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టకొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.&nbsp;</p>



<figure class="wp-block-image size-large is-resized"><img fetchpriority="high" decoding="async" width="1024" height="578" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-1-1024x578.jpeg" alt="Telangana auto drivers stage protest at Dharna Chowk in Hyderabad" class="wp-image-24238" style="aspect-ratio:1.7721518987341771;width:604px;height:auto" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-1-1024x578.jpeg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-1-300x169.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-1-768x433.jpeg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-1.jpeg 1221w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>



<h2 class="wp-block-heading">ఆటో డ్రైవర్లతో పెట్టుకుంటే పుట్టగతులుండవు- రూప్ సింగ్</h2>



<p class="wp-block-paragraph">రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతోందని టీఆర్ఎస్ సీనియర్ నేత రూప్ సింగ్ మండిపడ్డారు. ఫ్రీ బస్సు పేరుతో ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టిందని విమర్శించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి భారం కాకుండా వారి బతుకేదో వారు బతుకుతున్నారన్నారు. అలాంటి ఆటో డ్రైవర్ల జీవితాలపై పిడుగు వేసినట్లు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడపాలని నిర్ణయించటం సరికాదన్నారు. ఆటో డ్రైవర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టకట్టలేదని, రేవంత్ సర్కార్ కు కూడా అదే గతి పడుతుందన్నారు. వెంటనే ఎలక్ట్రిక్ ఆటోల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆటో డ్రైవర్లు పాతరేస్తారని హెచ్చరించారు.&nbsp;&nbsp;</p>



<figure class="wp-block-image size-large is-resized"><img decoding="async" width="1024" height="575" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-2-1024x575.jpeg" alt="Telangana auto drivers protest against electric autos and demand withdrawal of GO 263 at Hyderabad’s Dharna Chowk" class="wp-image-24239" style="aspect-ratio:1.7808990625103522;width:655px;height:auto" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-2-1024x575.jpeg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-2-300x168.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-2-768x431.jpeg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/telangana-auto-drivers-protest-dharna-chowk-hyderabad-2.jpeg 1225w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>



<h2 class="wp-block-heading">ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగితే ఊరుకోం &#8211; బోడ జనార్థన్</h2>



<p class="wp-block-paragraph">రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారికి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్థన్ హెచ్చరించారు. ఎలక్ట్రిక్ ఆటోలను ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపాలని నిర్ణయించటం సరికాదన్నారు. ఆటో డ్రైవర్ల కు మంచి చేయకపోయినా సరే చెడు చేసే కార్యక్రమాలు వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.&nbsp;</p>



<p class="wp-block-paragraph">ఆటోడ్రైవర్లకు అన్యాయం చేసే జీవో 263 ను వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆర్.వి. ఆర్ ప్రసాద్, నరేష్ ప్రజాపతి డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై చేసే ఈ పోరాటంలో ఆటో డ్రైవర్లంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పడాల మనోజ గౌడ్, వీరన్న తో పాటు ఆటో యునియన్ నాయకులు ఎం. ఎ సలీం, నజీరోద్దీన్, మహేందర్ నాయక్, శ్రీధర్, శివ ప్రసాద్, అబ్దుల్ గని, టీఆర్టీయూ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/telangana-auto-drivers-protest-go-263-electric-autos/">Telangana Auto Drivers Protest Over Electric Autos, Demand Withdrawal of GO 263</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>K Kavitha to Visit Nizamabad on August 31 for Panchajanya Sabha </title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-nizamabad-august-31-panchajanya-sabha/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Tue, 11 Aug 2026 14:32:49 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24233</guid>

					<description><![CDATA[<p>ఈనెల 31న నిజామాబాద్ కు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత &#160;కలెక్టరేట్ గ్రౌండ్ లో&#160; టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాకు తొలిసారిగా కవిత సభ ఏర్పాట్లపై నిజామాబాద్&#160; లో&#160; జరిగిన సన్నాహక సమావేశం (తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) ఈనెల 31న నిజామాబాద్ లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించెందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నది.&#160; తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ చీఫ్ [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-nizamabad-august-31-panchajanya-sabha/">K Kavitha to Visit Nizamabad on August 31 for Panchajanya Sabha </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">ఈనెల 31న నిజామాబాద్ కు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<h2 class="wp-block-heading">&nbsp;కలెక్టరేట్ గ్రౌండ్ లో&nbsp; టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ</h2>



<h2 class="wp-block-heading">పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాకు తొలిసారిగా కవిత</h2>



<h2 class="wp-block-heading">సభ ఏర్పాట్లపై నిజామాబాద్&nbsp; లో&nbsp; జరిగిన సన్నాహక సమావేశం</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్)</strong></p>



<p class="wp-block-paragraph">ఈనెల 31న నిజామాబాద్ లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించెందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నది.&nbsp; తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రానున్నారు.&nbsp; నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే ఈ సభలో తెలంగాణ రక్షణ సేన పార్టీ తీసుకున్న 5 లక్ష్యాలను శ్రీమతి కవిత వివరిస్తారు. పార్టీ సిద్ధాంతాలను పల్లె పల్లెకు చేరువ చేయాలని కవిత ఈ సభ ద్వారా పిలుపునివ్వనున్నారు.</p>



<p class="wp-block-paragraph">పాంచంజన్య సభ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నిజామాబాద్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని శ్రేణులకు రాష్ట్ర నాయకులు సూచించారు.&nbsp;</p>



<p class="wp-block-paragraph">పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జిల్లాకు రానున్న కవితకు పెద్ద ఎత్తున సభ విజయవంతం చేసి ఘన స్వాగతం పలకాలని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి అలీం భాయ్ తెలిపారు.&nbsp;</p>



<p class="wp-block-paragraph">నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే సభతో ప్రధాన పార్టీలకు వెన్నులో వణుకు పుట్టాలని కోరుట్ల నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ రఘు పేర్కొన్నారు. నిజామాబాద్ లో జరిగే పంచజన్య సభకు డాక్టర్ రఘు ను ఇన్చార్జిగా ఇప్పటికే ప్రకటించారు అధ్యక్షులు కవిత.&nbsp;</p>



<p class="wp-block-paragraph">ప్రతి పల్లె నుండి భారీ ఎత్తున శ్రేణులు కదలాలని టిఆర్ఎస్ నాయకులు రంగు నవీన్ ఆచారి పిలుపునిచ్చారు. కవితక్క రాష్ట్రంలో అందరికి ఆడబిడ్డ అయితే నిజామాబాద్ జిల్లాకు కోడలు అని ఈ జిల్లా బిడ్డను ఆదరించి అక్కున చేర్చుకోవాలని జిల్లా ప్రజలను ఆయన కోరారు.&nbsp; శ్రేణులు ఆ దిశగా నడుంబిగించి అన్ని వర్గాల ప్రజలను కదిలించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈనెల 26న మిలాద్ ఉన్ నబి పండుగ ఉన్నందున సభను ఈనెల 31కు మార్చినట్లు ఆయన తెలిపారు.</p>



<p class="wp-block-paragraph">ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి నవీన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ సమస్యల మీద ఇప్పటికే పార్టీ నుండి ఉద్యమాలు నిర్వహించినందున ఆ వర్గాలను కూడా సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.&nbsp;</p>



<p class="wp-block-paragraph">ఈ సన్నాహక సమావేశం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జి ఎం.ఎ అలీమ్,&nbsp; కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి డా. రఘు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-nizamabad-august-31-panchajanya-sabha/">K Kavitha to Visit Nizamabad on August 31 for Panchajanya Sabha </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>K Kavitha Demands Better Tribal Welfare, Irrigation and Roads in Asifabad</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-tribal-welfare-asifabad/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Tue, 11 Aug 2026 14:24:14 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24229</guid>

					<description><![CDATA[<p>ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత మంచినీరు అందించాలి* అడ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి కొమరం భీమ్ వర్ధంతి నాటికి కెరమెరి నుంచి జోడేఘాట్ వరకు డబుల్ రోడ్డు వేయాలి -తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ లో పలువురు ఆదివాసీ నాయకుల చేరిక (తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత తాగునీటిని అందించాలని, ప్రభుత్వం ఇందుకోసం [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-tribal-welfare-asifabad/">K Kavitha Demands Better Tribal Welfare, Irrigation and Roads in Asifabad</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత మంచినీరు అందించాలి*</h2>



<h2 class="wp-block-heading">అడ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి</h2>



<h2 class="wp-block-heading">కొమరం భీమ్ వర్ధంతి నాటికి కెరమెరి నుంచి జోడేఘాట్ వరకు డబుల్ రోడ్డు వేయాలి</h2>



<h2 class="wp-block-heading">-తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత</h2>



<h2 class="wp-block-heading">టీఆర్ఎస్ లో పలువురు ఆదివాసీ నాయకుల చేరిక</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :</strong></p>



<p class="wp-block-paragraph">రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత తాగునీటిని అందించాలని, ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణసేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఆదివాసీ నాయకులు, తెలంగాణ ఆదివాసీ టైగర్ సేన నాయకులు మంగళవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణసేనలో చేరారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆదివాసీల ఆరాధ్య నాయకుడు&nbsp; కొమరం భీమ్ వర్ధంతి నాటికి కెరమెరి నుంచి జోడేఘాట్ వరకు డబుల్ రోడ్డు నిర్మించాలన్నారు. అడ ప్రాజెక్టు, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుల కాల్వలు ఆధునీకరించి మొత్తం 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. పోడు సమస్య పరిష్కరించాలని.. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన హక్కుల పత్రాలకు సంబంధించిన భూములు వెంటనే ఆదివాసీలకు అప్పగించాలని కోరారు. ఇందుకోసం ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించాలన్నారు. ఆదివాసీలకు అండగా ఉండటం కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలు నామ్ కే వాస్తేగా మారిపోవడం దురదృష్టకరమన్నారు. ఆదివాసీ నాయకుడు సోయం బోజారావు గుట్టబండపై మట్టి పోసి పంటలు సాగు చేయడం ఆదివాసీల దుర్భర స్థితిగతులను తెలియజేస్తుందన్నారు. త్వరలోనే ఆదివాసీ ప్రాంతాలను సందర్శిస్తామని, ఆదివాసీలకు ఎళ్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కోట్నక కిషన్ రావ్, పెందోర్ ధర్ము, పెందోర్ దౌలత్ రావ్ తదితరులు టీఆర్ఎస్ లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ చార్జీ కావేటి సబిత తదితరులు పాల్గొన్నారు.</p>



<figure class="wp-block-image size-large is-resized"><img decoding="async" width="1024" height="682" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/k-kavitha-tribal-welfare-asifabad-telangana-1-1024x682.jpeg" alt="K Kavitha demands better nutrition, safe drinking water, irrigation and road connectivity for Adivasis in Telangana's Komaram Bheem Asifabad district" class="wp-image-24230" style="aspect-ratio:1.501508211373031;width:559px;height:auto" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/k-kavitha-tribal-welfare-asifabad-telangana-1-1024x682.jpeg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/k-kavitha-tribal-welfare-asifabad-telangana-1-300x200.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/k-kavitha-tribal-welfare-asifabad-telangana-1-768x512.jpeg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/k-kavitha-tribal-welfare-asifabad-telangana-1-600x400.jpeg 600w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/k-kavitha-tribal-welfare-asifabad-telangana-1-450x300.jpeg 450w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/k-kavitha-tribal-welfare-asifabad-telangana-1.jpeg 1280w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-tribal-welfare-asifabad/">K Kavitha Demands Better Tribal Welfare, Irrigation and Roads in Asifabad</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Kavitha Demands Health Insurance for Private Hospital Nurses in Telangana</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-nurses-health-insurance-telangana/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Tue, 11 Aug 2026 13:18:50 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24225</guid>

					<description><![CDATA[<p>ప్రైవేట్ హాస్పిటళ్ల నర్సులకు ఆరోగ్య బీమా కల్పించాలి నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చించాలి -తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) : ప్రైవేట్ హాస్పిటళ్లలో పనిచేసే నర్సులకు ఆరోగ్య బీమా సౌకర్యం లేకపోవటం బాధాకరమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో తనను కలిసిన ప్రైవేట్ హాస్పిటళ్ల నర్సులతో మాట్లాడి [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-nurses-health-insurance-telangana/">Kavitha Demands Health Insurance for Private Hospital Nurses in Telangana</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">ప్రైవేట్ హాస్పిటళ్ల నర్సులకు ఆరోగ్య బీమా కల్పించాలి</h2>



<h2 class="wp-block-heading">నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చించాలి</h2>



<h2 class="wp-block-heading">-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :</strong></p>



<p class="wp-block-paragraph">ప్రైవేట్ హాస్పిటళ్లలో పనిచేసే నర్సులకు ఆరోగ్య బీమా సౌకర్యం లేకపోవటం బాధాకరమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో తనను కలిసిన ప్రైవేట్ హాస్పిటళ్ల నర్సులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని.. అయినా ఆయా హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బందికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్లకు లేకపోవడం సరికాదన్నారు. వెంటనే ఈ విషయంపై ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో చర్చించి వారికి ఇన్సూరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పనివేళలు, జీతాలు, ఓవర్ టైమ్ వంటి అంశాల్లో తెలంగాణాకు చెందిన ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని&nbsp; మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోని ప్రైవేట్ హాస్పిటల్స్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బందికి, నర్సులకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.</p>



<p class="wp-block-paragraph"></p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kavitha-nurses-health-insurance-telangana/">Kavitha Demands Health Insurance for Private Hospital Nurses in Telangana</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>K Kavitha Unveils Social Justice Telangana Vision, Warns of Chalo Delhi Over BC Reservations Bill</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-social-justice-telangana-bc-reservations/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Fri, 07 Aug 2026 09:21:59 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24222</guid>

					<description><![CDATA[<p>సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ సంకల్పం ఈ సామాజిక న్యాయ సంకల్ప సభ కొట్లాది మంది జీవితాలను మార్చబోతోంది అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నా బీసీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేయించకుంటే వెయ్యి కార్లతో ఛలో ఢిల్లీ &#160;-సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్): సామాజిక న్యాయ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని తెలంగాణ [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-social-justice-telangana-bc-reservations/">K Kavitha Unveils Social Justice Telangana Vision, Warns of Chalo Delhi Over BC Reservations Bill</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ సంకల్పం</h2>



<h2 class="wp-block-heading">ఈ సామాజిక న్యాయ సంకల్ప సభ కొట్లాది మంది జీవితాలను మార్చబోతోంది</h2>



<h2 class="wp-block-heading">అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నా</h2>



<h2 class="wp-block-heading">బీసీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేయించకుంటే వెయ్యి కార్లతో ఛలో ఢిల్లీ</h2>



<h2 class="wp-block-heading">&nbsp;-సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్):</strong></p>



<p class="wp-block-paragraph">సామాజిక న్యాయ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు. సమాజంలోని అట్టడుగు, అణగారిన వర్గాల్లో సాధికారిత వచ్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు పోరాటం చేయాలంటే అందుకు దమ్ము, ధైర్యం ఉండాలని&#8230;ఆ దమ్ము, ధైర్యం తనకు ఉందని చెప్పారు. బీసీల కోసం నేను మాట్లాడితే అగ్రకులంలో పుట్టిన నీకెందుకంటూ కొందరూ మాట్లాడుతారని అన్నారు. కానీ నా పుట్టుక నా చేతిలో లేదని, కానీ నేను ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకునే హక్కు తనకుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు గన్న సామాజిక తెలంగాణ సాధించి తీరుతానని సంకల్పం తీసుకుంటున్నట్లు కవిత చెప్పారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">సామాజిక తెలంగాణ కోసం జీవితం అంకితం</h2>



<p class="wp-block-paragraph">సామాజిక తెలంగాణ కోసం ఇక తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని కవిత అన్నారు. ఇప్పటి వరకు కనీసం సర్పంచ్ కూడా కానీ కులాల్లో సాధికారిత వచ్చే వరకు వారితో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు. అగ్రకులంలో పుట్టిన తాను బీసీల కోసం మాట్లాడటం ఏంటనీ ఈ సభ తర్వాత కొంతమంది నన్ను ప్రశ్నిస్తారు. కానీ ఇప్పటి వరకు సమాజంలో జరిగిన అనేక ప్రజాస్వామిక మార్పులకు అగ్రకులాల్లో పుట్టిన ప్రజాస్వామిక వాదులే కారణమయ్యారు. అని ఆమె అన్నారు. ఆనాటి రాజుల కాలంలోనూ గౌతమ బుద్ధుడు, సాహు మహారాజు లాంటి క్షత్రియ పుత్రులే అట్టడుగు వర్గాల మేలు కోసం పనిచేశారని గుర్తు చేశారు. మండలి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్లు బీరువాలో పెడితే దాన్ని క్షత్రియుడైన వి.పి సింగ్ అమలు చేశారని చెప్పారు. తమిళనాడులో బీసీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు అమలు కావాలని వాటిని 9 వ షెడ్యూల్ లో చేర్చింది అగ్రకులానికి చెందిన జయలలితేనని గుర్తు చేశారు. తన పుట్టుక తన చేతిలో లేదని&#8230;కానీ తాను ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకునేది తనేనని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం ఇక తాను సంకల్పం తీసుకున్నానని&#8230;అందు కోసం తన జీవితాన్నే అంకితం చేస్తున్నానని చెప్పారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">సామాజిక సంకల్ప సభ కొట్లాది జీవితాల్లో మార్పు తెస్తుంది</h2>



<p class="wp-block-paragraph">తాము చేపట్టిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కచ్చితంగా కొట్లాది మంది జీవితాల్లో మార్పు తెస్తుందని కవిత అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కే విధంగా గ్రామ గ్రామనా తమ పార్టీ శ్రేణులు పోరాటం చేస్తాయని ఆమె చెప్పారు. సమాజంలో ఒక గొప్ప మార్పు తెచ్చే అవకాశం ఒక పార్టీగా తమకు దక్కిందని అన్నారు. ఈ పోరాటాన్ని సాయిత్రి భాయ్ పూలే జయంతి వరకు 5 నెలల పాటు మరిన్ని సభలు సమావేశాలు నిర్వహిస్తూ కొనసాగిస్తామన్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 6 న నాటికి సామాజిక న్యాయ తెలంగాణ పోరాటంలో పురోగతిని సమీక్షించుకుంటామన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారందరితో కలిసి పనిచేస్తామని కవిత చెప్పారు. సామాజిక న్యాయం అంటే 10 శాతం ఉన్న వాళ్లు 90 శాతం అవకాశాలను దక్కించుకోవటం కాదని&#8230;90 శాతం ఉన్న వాళ్లకు సమానంగా అవకాశాలు దక్కాల్సి ఉందన్నారు. రాజుల కాలం నాటి నుంచి ఇప్పటి వరకు సమాజంలో ఎంతో మార్పు వచ్చిందని ఆమె చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ల్లో ఆర్థిక అసమానతలు కాస్త తగ్గించినప్పటికీ కుల వివక్ష విషయంలో మాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్షను పొగొట్టటంలో జరగాల్సినన్నీ పోరాటాలు జరగలేదని కవిత చెప్పారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">బీసీ బిల్లును వచ్చే బడ్జెట్ సెషన్ లోపు పాస్ చేయాలి</h2>



<p class="wp-block-paragraph">బీసీ లకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిందన్నారు. 46 శాతం బీసీలు, 10 శాతం బీసీ ముస్లింలు ఉంటే 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు అంటూ వింత లెక్కలు ప్రతిపాదించిందన్నారు. పైగా బీసీ రిజర్వేషన్ల బిల్లును అమలు కాకుండా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమ లేఖలు రాసుకుంటూ గల్లీ లో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్న విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఎందుకు కలిసి పనిచేయరంటూ కవిత ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్ సెషన్ లోపు బీసీ బిల్లు పాస్ చేసి పంపించాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కు లు సహా ఎస్సీ, ఎస్టీలకు వారి నిధులు వారి అభ్యున్నతికే ఖర్చు చేయాలన్నారు. ముస్లింలను కేవలం మాటలతోనే అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మాటలతో కడుపు నిండదని వారికి న్యాయం చేయాలని కోరారు. ముస్లింలు తమతో కలిసి రావాలని కవిత పిలుపునిచ్చారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">జయశంకర్ సార్ కన్న కలను నిజం చేస్తా</h2>



<p class="wp-block-paragraph">తెలంగాణ ఉద్యమ సమయంలోనే సామాజిక తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాట్లాడే వారని కవిత అన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా శక్తులతో పోరాడుతూ సామాజిక తెలంగాణ కోసం పోరాటం కష్టమని ఆయన చెప్పారన్నారు. అయితే భౌగోళిక తెలంగాణ సాధన తర్వాత సామాజిక తెలంగాణ సాధించాలని చెప్పేవారన్నారు. ఆయన కన్న కలను నిజం చేసేందుకు తాను సంకల్పం తీసుకున్నానని కవిత చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ 97 శాతం జనం పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇక 71 శాతం మంది బీసీలు పరిస్థితి ఎస్సీ ల కన్నా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు రావాలని కవిత అన్నారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">సామాజిక న్యాయ తెలంగాణ కోసం ప్రతిజ్ఞ</h2>



<p class="wp-block-paragraph">సామాజిక న్యాయ తెలంగాణ కోసం కవిత టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. అన్ని వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం దక్కే వరకు పోరాటం చేస్తామని అన్నారు. రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక స్వావలంభన అన్ని వర్గాలకు దక్కే వరకు అంకితభావంతో పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సభలో కవిత పలు తీర్మానాలు ప్రతిపాదించారు.&nbsp;</p>



<p class="wp-block-paragraph">1. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు కలిసి వచ్చే వారితో దేశ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఉద్యమిస్తుంది.&nbsp;</p>



<p class="wp-block-paragraph">2. మహత్మా జ్యోతిరావ్ పూలే దంపతులకు భారత రత్న అవార్డు ఇవ్వాలి.&nbsp;</p>



<p class="wp-block-paragraph">3. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని పెట్టాలి.&nbsp;</p>



<p class="wp-block-paragraph">4. ఎస్సీ, ఎస్టీల నిధులను వాళ్ల అభ్యున్నతి కోసమే వాడాలి.&nbsp;</p>



<p class="wp-block-paragraph">5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను నింపేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలి.&nbsp;</p>



<p class="wp-block-paragraph">6. ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు రావాలి.&nbsp;</p>



<p class="wp-block-paragraph">7. డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.</p>



<p class="wp-block-paragraph">8. ముస్లింలకు ఆర్థిక స్వావలంభనతో పాటు వక్ఫ్ బోర్డు చట్టం తేవాలి.&nbsp;</p>



<p class="wp-block-paragraph">9. సిక్కులు, క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంభన ఉండేలా చర్యలు తీసుకోవాలి.&nbsp;</p>



<p class="wp-block-paragraph">10 . ట్రాన్స్ జండర్లకు సంపూర్ణ హక్కులు రావాలి.&nbsp;</p>



<p class="wp-block-paragraph">11. వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు పెంచాలి. వారికి కో ఆప్షన్ సభ్యుల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఈ తీర్మానాలకు సభికులు ఆమోదం తెలిపారు.</p>



<p class="wp-block-paragraph">ఎక్స్&nbsp; (ట్విట్టర్) ట్రెండింగ్ లో&nbsp; ఇండియా నంబర్ వన్ గా టీఆర్ఎస్ 4 సోషల్ జస్టిస్</p>



<p class="wp-block-paragraph">&nbsp;#TRS4SocialJustice హాష్ ట్యాగ్ పై కవిత చేసిన పోస్ట్ ఇండియాలోనే నంబర్ వన్ గా ట్రెండ్ అవటం విశేషం.&nbsp;</p>



<p class="wp-block-paragraph">సరూర్ నగర్ లో సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పార్టీ నాయకులతో ప్రతిజ్ఞ చేయించిన వీడియోను ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇండియాలోనే నంబర్ వన్ గా డ్రెండ్ అవటం తో టీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/k-kavitha-social-justice-telangana-bc-reservations/">K Kavitha Unveils Social Justice Telangana Vision, Warns of Chalo Delhi Over BC Reservations Bill</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Samajika Nyaya Telangana Sankalpa Sabha Ready in Hyderabad: 10,000 Delegates to Take Social Justice Pledge with Kalvakuntla Kavitha</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/samajika-nyaya-telangana-sankalpa-sabha-hyderabad/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 05 Aug 2026 14:08:25 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24215</guid>

					<description><![CDATA[<p>సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు సర్వం సిద్ధం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ సామాజిక న్యాయ తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేయనున్న10 వేల మంది ప్రతినిధులు (తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత, పలువురు [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/samajika-nyaya-telangana-sankalpa-sabha-hyderabad/">Samajika Nyaya Telangana Sankalpa Sabha Ready in Hyderabad: 10,000 Delegates to Take Social Justice Pledge with Kalvakuntla Kavitha</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు సర్వం సిద్ధం</h2>



<h2 class="wp-block-heading">సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ</h2>



<h2 class="wp-block-heading">సామాజిక న్యాయ తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేయనున్న10 వేల మంది ప్రతినిధులు</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్)</strong></p>



<p class="wp-block-paragraph">సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత, పలువురు ప్రముఖులు సభలో పాల్గొనున్నారు. సామాజిక న్యాయ తెలంగాణ ను సాకారం చేయడానికి కవిత సహా 10 వేల ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు సరూర్ నగర్ సభకు తరలివస్తున్నారు.</p>



<p class="wp-block-paragraph">రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సాధికారత లక్ష్య సాధన కోసం కవిత ఈ వేదిక నుంచి ప్రకటన చేస్తారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిలో మార్పు తీసుకురావడానికి తాము ఎలాంటి ఎజెండా తీసుకుబోతున్నామో స్పష్టత ఇవ్వనున్నారు.</p>



<p class="wp-block-paragraph">ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత శక్తి వంతులైన వలస పాలకుల పీడన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ సహా లక్షలాది మంది ఉద్యమించారు. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ సాధన కోసం జయశంకర్ స్ఫూర్తితో కవిత ఉద్యమించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత సామాజిక తెలంగాణ సాకారం కోసం మళ్లీ పోరాడాల్సిందేనన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాటలతో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత స్ఫూర్తి పొందారు. ఆయన ఆశయాల సౌధమైన సామాజిక న్యాయ తెలంగాణ సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే తన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయ తెలంగాణ అనే నినాదంగా మిగిలిపోకూడదు.. అట్టడుగు వర్గాలపై లిప్ సింపతీతో సరిపెట్టకూడదు.. ఒక మాట చెప్తే వంద శాతం ఆచరించాలని శపథం తీసుకున్నారు.</p>



<p class="wp-block-paragraph">రెండు దశాబ్దాలుగా తెలంగాణ జాగృతిలో.. ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీలో అట్టడుగు వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటిస్తే 22 మంది బీసీ నాయకులకు అవకాశం ఇచ్చారు. తొమ్మిది లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటిస్తే అందులోనూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ అనుబంధంగా నాలుగు విభాగాలను ప్రకటిస్తే అందులో కీలమైన మహిళ, విద్యార్థి విభాగాల అధ్యక్షులుగా బీసీలకు అవకాశం ఇచ్చారు. భవిష్యత్ లోనూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులకు అవకాశాలు కల్పిస్తామని బలంగా చెప్తున్నారు.</p>



<p class="wp-block-paragraph">తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సామాజిక న్యాయ తెలంగాణాను సాకారం చేసుకొనే దిశగా సరూర్ నగర్ వేదిక నుంచి కల్వకుంట్ల కవిత గారు మొదటి అడుగు వేయబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కవిత చేయబోతున్న శంఖారావం గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేలా తెలంగాణ రక్షణ రాబోయే రోజుల్లో పని చేయబోతున్నది.</p>



<h2 class="wp-block-heading">సామాజిక వైతాళికులను కీర్తించుకునేలా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ప్రాంగణం</h2>



<h2 class="wp-block-heading">సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు</h2>



<h2 class="wp-block-heading">సభా ప్రాంగణంలో పలువురు ప్రముఖుల ఫ్లెక్సీలు</h2>



<h2 class="wp-block-heading">తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేలా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ</h2>



<p class="wp-block-paragraph">తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చే మహా యజ్ఞానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అంకురార్పణ చేయబోతున్నారు</p>



<p class="wp-block-paragraph">సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణగా పునర్నిర్మాణం చేసే కర్తవ్యాన్ని తన భుజానికి ఎత్తుకున్నారు.. సబ్బండ వర్గాల వికాసం.. సాధికారతే లక్ష్యంగా గురువారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో &#8220;సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ&#8221; నిర్వహిస్తున్నారు</p>



<figure class="wp-block-gallery has-nested-images columns-default is-cropped wp-block-gallery-1 is-layout-flex wp-block-gallery-is-layout-flex">
<figure class="wp-block-image size-large"><img loading="lazy" decoding="async" width="1024" height="768" data-id="24217" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-3-1024x768.jpeg" alt="Preparations underway for the Samajika Nyaya Telangana Sankalpa Sabha at Saroor Nagar Indoor Stadium in Hyderabad" class="wp-image-24217" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-3-1024x768.jpeg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-3-300x225.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-3-768x576.jpeg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-3.jpeg 1280w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>



<figure class="wp-block-image size-large"><img loading="lazy" decoding="async" width="1024" height="768" data-id="24218" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-2-1024x768.jpeg" alt="Kalvakuntla Kavitha at the Samajika Nyaya Telangana Sankalpa Sabha" class="wp-image-24218" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-2-1024x768.jpeg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-2-300x225.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-2-768x576.jpeg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/samajika-nyaya-telangana-sankalpa-sabha-kalvakuntla-kavitha-hyderabad-2.jpeg 1280w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>
</figure>



<h2 class="wp-block-heading">సామాజిక వైతాళికులను కీర్తించుకునేలా సభ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు</h2>



<p class="wp-block-paragraph">సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాజకీయాలను పరిచయం చేస్తూ అందులో ఆయా వర్గాల వారిని భాగస్వామ్యం చేయబోతున్నారు</p>



<p class="wp-block-paragraph">సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని సభా ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, తన జీవితం మొత్తాన్ని తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్, సామాజిక అంతరాలను రూపుమాపేందుకు కృషి సాగించిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే, మొదటి మహిళా ఉపాధ్యాయులు మాతా సావిత్రి భాయి పూలే, అట్టడుగు వర్గాల ప్రజలు పేదరికం, పీడన నుంచి బయట పడేందుకు విద్య మాత్రమే ఆయుధమని నమ్మి&nbsp; పాఠశాలలు ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్రపటాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు.</p>



<p class="wp-block-paragraph">నిజాం రాజ్యంలో దేశ్ ముఖ్ లు, దొరల దురహంకారంపై తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య, నిజాం సింహాసనాన్ని వణికించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, బహుజనులకు రాజ్యాధికారం కోసం కృషి సాగించిన మాన్యశ్రీ కాన్షి రామ్, జల్-జంగిల్-జమీన్ పై హక్కుల కోసం పోరుసగించిన యోధుడు కొమురం భీమ్, నిఖార్సయిన తెలంగాణవాది, ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవి తృణ ప్రాయంగా వదులుకున్న బహుజన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, సమాజంలో దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ చిత్రపటాలు ఏర్పాటు చేస్తున్నారు.</p>



<p class="wp-block-paragraph">తొలి తరం తెలంగాణ ఉద్యమకారులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి దళిత మహిళా ఎమ్మెల్యే, మొదటి మహిళా డిప్యూటీ స్పీకర్ టీఎన్ సదాలక్ష్మీ, నిజాం నిరంకుశత్వంపై పోరాడిన బహుజన యోధుడు పండుగ సాయన్న, బహుజన గెరిల్లా యోధుడు వడ్డెర ఓబన్న, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్, ఉమ్మడి ఏపీ నుంచి లోక్ సభకు ఎన్నికైన మొదటి మహిళా నాయకురాలు, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు సంగం లక్ష్మీ బాయి, అక్షర యోధుడు, రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఎక్కుపెట్టిన వీరుడు షోయబుల్లాఖాన్, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఆద్యుడు, కుల &#8211; వర్గ పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రముఖ కవి, కార్మిక నాయకులు మఖ్దూం మొహియుద్దీన్ ల విగ్రహాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/samajika-nyaya-telangana-sankalpa-sabha-hyderabad/">Samajika Nyaya Telangana Sankalpa Sabha Ready in Hyderabad: 10,000 Delegates to Take Social Justice Pledge with Kalvakuntla Kavitha</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Niloufer Hospital Negligence Alleged: Telangana Rakshana Sena Demands Better Facilities for Mothers</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/niloufer-hospital-negligence-maternal-healthcare-hyderabad/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Tue, 04 Aug 2026 16:44:29 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24210</guid>

					<description><![CDATA[<p>నీలోఫర్ లో బాలింతల పట్ల నిర్లక్ష్యం ప్రభుత్వం మెడలు వంచి సదుపాయాలు అందిస్తాం &#160;-తెలంగాణ రక్షణ సేన మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మనోజ గౌడ్ హాస్పిటల్ లోనికి వెళ్లకుండా టీఆర్ఎస్ మహిళా నేతలపై సిబ్బంది దౌర్జన్యం (తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్):  నీలోఫర్ హాస్పిటల్ లో బాలింతలను కూర్చీలో కూర్చొపెట్టి వైద్యం అందించడం సిగ్గు చేటని తెలంగాణ రక్షణసేన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు పడాల మనోజ గౌడ్ విమర్శించారు. నీలోఫర్ లో కనీస వైద్యసౌకర్యాలు లేక [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/niloufer-hospital-negligence-maternal-healthcare-hyderabad/">Niloufer Hospital Negligence Alleged: Telangana Rakshana Sena Demands Better Facilities for Mothers</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">నీలోఫర్ లో బాలింతల పట్ల నిర్లక్ష్యం</h2>



<h2 class="wp-block-heading">ప్రభుత్వం మెడలు వంచి సదుపాయాలు అందిస్తాం</h2>



<h2 class="wp-block-heading">&nbsp;-తెలంగాణ రక్షణ సేన మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మనోజ గౌడ్</h2>



<h2 class="wp-block-heading">హాస్పిటల్ లోనికి వెళ్లకుండా టీఆర్ఎస్ మహిళా నేతలపై సిబ్బంది దౌర్జన్యం</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్): </strong></p>



<p class="wp-block-paragraph">నీలోఫర్ హాస్పిటల్ లో బాలింతలను కూర్చీలో కూర్చొపెట్టి వైద్యం అందించడం సిగ్గు చేటని తెలంగాణ రక్షణసేన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు పడాల మనోజ గౌడ్ విమర్శించారు. నీలోఫర్ లో కనీస వైద్యసౌకర్యాలు లేక బాలింతలు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారనే సమాచారంతో టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మంగళవారం హాస్పిటల్ సందర్శించారు. నీలోఫర్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది టీఆర్ఎస్ నాయకులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. హాస్పిటల్ లో పరిస్థితులను చిత్రీకరిస్తున్న ఫొటోగ్రాఫర్ల దగ్గరి నుంచి కెమెరాలు, మైకులు లాక్కునే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ తీరుపై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. గర్భిణీలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించాలని కోరితే దౌర్జన్యానికి పాల్పడుతారా అని ప్రశ్నించారు. సరైన వైద్య సేవలు అందిస్తే తమను ఎందుకు లోపలకి పంపించడం లేదని నిలదీశారు. మహిళలకు కనీస వైద్య సౌకర్యాలు లేవని, ఒక్కో బెడ్ ను ముగ్గురు పేషెంట్లకు కేటాయిస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ అయిన పేషెంట్లను స్ట్రెచర్ పై తీసుకెళ్లకుండా నడిపించుకుంటూ తీసుకెళ్లడం అత్యంత దారుణమన్నారు. నీలోఫర్ హాస్పిటల్ లో జరుగుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వంలోని మహిళా మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ లో సరైన వసతులు కల్పించాలని కోరారు. లేదంటే ప్రభుత్వం మెడలు వంచైనా వసతులు కల్పించేలా చేస్తామని హెచ్చరించారు.</p>



<figure class="wp-block-image size-large is-resized"><img loading="lazy" decoding="async" width="1024" height="576" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/niloufer-hospital-hyderabad-maternal-healthcare-2-1024x576.jpg" alt="Telangana Rakshana Sena alleged inadequate healthcare facilities for mothers and pregnant women at Niloufer Hospital and called for immediate improvements in medical infrastructure." class="wp-image-24211" style="width:604px;height:auto" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/niloufer-hospital-hyderabad-maternal-healthcare-2-1024x576.jpg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/niloufer-hospital-hyderabad-maternal-healthcare-2-300x169.jpg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/niloufer-hospital-hyderabad-maternal-healthcare-2-768x432.jpg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/niloufer-hospital-hyderabad-maternal-healthcare-2.jpg 1120w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/niloufer-hospital-negligence-maternal-healthcare-hyderabad/">Niloufer Hospital Negligence Alleged: Telangana Rakshana Sena Demands Better Facilities for Mothers</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Telangana Rakshana Sena to Hold &#8216;Social Justice Telangana Sankalpa Sabha&#8217; on August 6 </title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/social-justice-telangana-sankalpa-sabha-august-6-hyderabad/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Sat, 01 Aug 2026 10:06:08 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24206</guid>

					<description><![CDATA[<p>6న ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’ పోస్టర్ ఆవిష్కరించిన టీఆర్ఎస్ నాయకులు (తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) : సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణసేన పార్టీ ఈనెల 6వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’ నిర్వహిస్తున్నది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన నాయకులు తెలిపారు. [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/social-justice-telangana-sankalpa-sabha-august-6-hyderabad/">Telangana Rakshana Sena to Hold &#8216;Social Justice Telangana Sankalpa Sabha&#8217; on August 6 </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">6న ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’</h2>



<h2 class="wp-block-heading">పోస్టర్ ఆవిష్కరించిన టీఆర్ఎస్ నాయకులు</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :</strong></p>



<p class="wp-block-paragraph">సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణసేన పార్టీ ఈనెల 6వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’ నిర్వహిస్తున్నది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన నాయకులు తెలిపారు. శనివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఎల్. రూప్ సింగ్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతి సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ నెల 6న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ నిర్వహించనున్నామని చెప్పారు. సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజునే ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల్లోని అనేక కులాల వారికి కనీసం గ్రామ సర్పంచ్ గా కూడా అవకాశం దక్కడం లేదన్నారు. అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో ప్రాతినిధ్యం దక్కేలా ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నవీన్ ఆచారి, నరేశ్ ప్రజాపతి, కోల శ్రీనివాస్, చిలుక ప్రవీణ్, సుహైబ్ తదితరులు పాల్గొన్నారు.</p>



<figure class="wp-block-image size-large is-resized"><img loading="lazy" decoding="async" width="1024" height="576" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/social-justice-telangana-sankalpa-sabha-poster-hyderabad-1-1024x576.jpg" alt="Telangana Rakshana Sena announced its Social Justice Telangana Sankalpa Sabha on August 6 at Saroor Nagar Indoor Stadium, coinciding with Professor Jayashankar's birth anniversary." class="wp-image-24208" style="width:562px;height:auto" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/social-justice-telangana-sankalpa-sabha-poster-hyderabad-1-1024x576.jpg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/social-justice-telangana-sankalpa-sabha-poster-hyderabad-1-300x169.jpg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/social-justice-telangana-sankalpa-sabha-poster-hyderabad-1-768x432.jpg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/08/social-justice-telangana-sankalpa-sabha-poster-hyderabad-1.jpg 1344w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/social-justice-telangana-sankalpa-sabha-august-6-hyderabad/">Telangana Rakshana Sena to Hold &#8216;Social Justice Telangana Sankalpa Sabha&#8217; on August 6 </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
